News February 19, 2025
సంగారెడ్డి: చెరువులో మునిగి ఇద్దరు మృతి

ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. చర్చి గాగిల్లపూర్కు చెందిన వల్లపు నరేష్(26) అతని స్నేహితుడు శంకర్(22) వావిలాల గ్రామంలోని పీర్ష చెరువులో ఈత కొట్టడానికి దిగగా చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 14, 2025
నటన వదిలేద్దామనుకున్నా.. నాన్న ఆపారు: అభిషేక్ బచ్చన్

దిగ్గజ నటుడైన అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అభిషేక్ బచ్చన్ కెరీర్ తొలినాళ్లలో వరసగా 12కు పైగా ఫ్లాపుల్ని చవిచూశారు. ఆ సమయంలో సినిమాల్ని వదిలేయాలని తాను భావించినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘ఓరోజు నాన్నతో నా బాధ చెప్పాను. ఈ రంగం వదిలేస్తానన్నాను. కానీ నాన్న నన్ను వారించారు. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నానని, పోరాటం ఆపొద్దని చెప్పి నాలో స్ఫూర్తి నింపారు’ అని వెల్లడించారు.
News March 14, 2025
NGKL: జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మార్చ్ నెల మొదటి వారంలోని ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్వకుర్తి ప్రాంతంలో శుక్రవారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకున్నాయి.
News March 14, 2025
స్టార్ క్రికెటర్ కూతురు మృతి

అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండేళ్ల కూతురు మరణించినట్లు అఫ్గాన్ జట్టు ఆటగాడు కరీం జనత్ ఇన్స్టా ద్వారా వెల్లడించారు. చిన్నారి ఫొటోను షేర్ చేశారు. అయితే ఆమె ఎలా మరణించిందనేది తెలియరాలేదు. స్టార్ హిట్టర్గా పేరొందిన జజాయ్ T20ల్లో 6 బంతులకు 6 సిక్సర్లు బాదడం, ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(12 బంతుల్లో) చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరారు.