News April 10, 2025

సంగారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్.. నేడు భారీ వర్షం

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మెదక్‌లో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడనుండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News October 23, 2025

ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ ఫస్ట్ లుక్ రివీల్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న సినిమా టైటిల్ రివీలైంది. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బియర్డ్ లేకుండా ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. అలాగే ఓ సంస్కృత శ్లోకాన్ని మేకర్స్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

News October 23, 2025

NLG : ‘కాల్’ పోదు.. నెట్ రాదు.. BSNLతో తలనొప్పి

image

జిల్లాలో BSNL సేవల్లో అంతరాయంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారులు నెట్ వర్క్ సంబంధిత ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా ఫోన్ కాల్స్ కనెక్ట్ కాకపోవడం.. మాట్లాడుతుండగానే మధ్యలోనే కాల్ కట్ అవడం.. ఇక ఇంటర్నెట్ సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మొబైల్ డేటా రాకపోవడంతో యూపీఐ ద్వారా ఆన్ లైన్ చెల్లింపుల్లో సైతం అంతరాయం ఏర్పడుతుంది.

News October 23, 2025

పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి

image

AP: రైతుల నుంచి కనీస మద్దతు ధరకు CCI ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పత్తి రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్‌లో నమోదై, సీఎం యాప్ ద్వారా లాగిన్ అయి, ఆధార్ అనుసంధానంతో కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. కపాస్ యాప్ స్లాట్ బుకింగ్ ప్రకారం పత్తిని CCI కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి. రైతులకు సందేహాలుంటే 7659954529కు కాల్ చేయొచ్చు.