News March 17, 2025
సంగారెడ్డి: జిల్లాకు చేరుకున్న పదో తరగతి ప్రశ్నా పత్రాలు

జిల్లాలో ఈ నెల 21 నుంచి నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నా పత్రాలు జిల్లాకు చేరుకున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రశ్నా పత్రాలను రూట్ అధికారుల ఆధ్వర్యంలో వివిధ మండల పోలీస్ స్టేషన్ లకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 17, 2025
ఇన్స్టాలో ప్రేమ.. మూడు నిండు ప్రాణాలు బలి

ఇన్స్టాలో మొదలైన 2 వేర్వేరు ప్రేమకథలు విషాదాంతంగా ముగిశాయి. TGలో హుజూరాబాద్కు చెందిన రాహుల్(18), నిర్మల్ జిల్లాకు చెందిన శ్వేత(20) ఇన్స్టాలో ప్రేమించుకున్నారు. పెద్దవారికి భయపడి ఇద్దరూ రైలు కింద పడి చనిపోయారు. ఇక గుంటూరుకు చెందిన సాయికుమార్, గీతిక అనే జంట ఇన్స్టాలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నెలల వ్యవధిలోనే గీతిక అనుమానాస్పదంగా మరణించింది. భర్తే చంపాడని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
News March 17, 2025
ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. తగ్గిన పత్తి ధర

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు ప్రారంభం కాగా.. పత్తి బస్తాలను అధిక సంఖ్యలో రైతులు మార్కెట్కు తీసుకువచ్చారు. అయితే తాము ఆశించిన స్థాయిలో ధర రాలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేడు పత్తి ధర క్వింటాకి రూ.6,825 ధర పలికిందని చెప్పారు. గత వారం పత్తి ధర రూ.6,960 పలకగా ఈరోజు ధరలు భారీగా పడిపోవడంతో పత్తి రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
News March 17, 2025
VKB: విషాదం.. ఈతకు వెళ్లి బాలుడి మృతి

వికారాబాద్ జిల్లా దోమ మండలం గన్యా నాయక్ తండాలో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి నేనావత్ బాలాజీ (13) ఆదివారం మధ్యాహ్నం చెరువులో ఈతకు వెళ్లి చెరువులో మునిగి మృతిచెందాడు. ఈరోజు ఉదయం చెరువులో శవమై కనిపించాడు. బాలుడి మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.