News April 15, 2025
సంగారెడ్డి: జిల్లాకు చేరుకుంటున్న పాఠ్య పుస్తకాలు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకుంటున్నట్లు పాఠ్య పుస్తకాల మేనేజర్ తెలిపారు. జిల్లాకు 9.86 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 20,710 పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రానికి వచ్చాయని, మిగతా పుస్తకాలు ఈ నెల ఆఖరు వరకు వస్తాయని పేర్కొన్నారు. పూర్తిగా పాఠ్య పుస్తకాలు రాగానే మండలాలకు పంపిణీ చేయనున్నట్లు మేనేజర్ చెప్పారు.
Similar News
News November 18, 2025
MHBD: డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేయాలి: కలెక్టర్

ప్రతి ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, అనిల్ కుమార్ సమక్షంలో అధికారులు, ఉద్యోగులందరూ కలిసి మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 18, 2025
MHBD: డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేయాలి: కలెక్టర్

ప్రతి ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, అనిల్ కుమార్ సమక్షంలో అధికారులు, ఉద్యోగులందరూ కలిసి మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 18, 2025
ఉలిక్కిపడిన రాష్ట్రం

AP: కొన్నేళ్లుగా మావోయిస్టుల ప్రభావం లేకుండా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఇవాళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో అగ్రనేత హిడ్మా హతమవడం, విజయవాడ, కాకినాడలో పెద్ద సంఖ్యలో మావోలను అరెస్టు చేయడం కలకలం రేపింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పెనమలూరులో ఓ బిల్డింగ్ను అద్దెకు తీసుకుని 10 రోజులుగా ఉంటున్నా బయటికి పొక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


