News March 23, 2025

సంగారెడ్డి: జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు విడుదల

image

జిల్లాలో ఆదివారం అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు ప్రకటించారు. అత్యధికంగా వట్పల్లిలో 37.7, పాల్వంచలో 37.6, ఆందోలు మండలం అల్మాయిపేట 36.9, కల్హేర్‌లో 36.7, ఆందోలు మండలం అన్నాసాగర్‌లో 36.6, నారాయణఖేడ్ లో 36.4, జహీరాబాద్ మండలం అల్గోల్‌లో 36.2, చౌటకూర్, కందిలలో 36.1, నిజాంపేట, కోహీర్ మండలం దిగ్వల్, కొండాపూర్, పుల్కల్ లలో 36.0 ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించారు.

Similar News

News November 9, 2025

రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం

image

కొలిమిగుండ్ల(M) కల్వటాల సమీపంలోని రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో డ్రైవర్ గురు ప్రసాద్ మృతి చెందినట్లు కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు వెల్లడించారు. సిమెంటు లోడు చేసుకొని పైకప్పు బిగిస్తుండగా ట్యాంకర్ నుంచి జారి కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతుడు ఉయ్యాలవాడ మండలం అల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సీఐ రమేష్ బాబు పేర్కొన్నారు.

News November 9, 2025

రాజన్న ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసం ఆదివారం సందర్భంగా భక్తులతో రాజన్న ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ఆవరణలోని రావి చెట్టు వద్ద భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసంలో రాజన్న సన్నిధిలో దీపాలను వెలిగించడం ద్వారా శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం.

News November 9, 2025

మామిడిలో ఆకుతినే పురుగు నివారణకు సూచనలు

image

మామిడిని ఆకుతినే పురుగు ఆశించి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు అజాడిరక్టిన్(3000 పి.పి.ఎం.) 300 మి.లీ.లతోపాటు ఎసిఫేట్ 75% ఎస్.పి. 150 గ్రా. లేదా క్వినాల్‌ఫాస్ 25% ఇ.సి. 200ml లేదా ప్రొఫెనోఫోస్ 50% ఇ.సి. 200ml లలో ఏదైనా ఒక దానిని 100 లీటర్ల నీటికి కలిపి చెట్టు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అలాగే మామిడి తోటలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.