News March 23, 2025

సంగారెడ్డి: ‘జిల్లాలో ఎలాంటి పంట నష్టం జరగలేదు’

image

జిల్లాలో రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలకు ఎలాంటి పంట నష్టం జరగలేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ శనివారం తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేసినట్లు చెప్పారు. జిల్లాలు ఎక్కడైనా పంట నష్టం జరిగితే మండల వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Similar News

News January 8, 2026

BRAEKING: బాంబు బెదిరింపు.. విశాఖ జిల్లా కోర్టులో తనిఖీలు

image

విశాఖ జిల్లా కోర్టుల వాణిజ్య సముదాయంలో భద్రతా సిబ్బంది గురువారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కోర్టు మెయిల్‌కు బాంబు పెట్టినట్లుగా సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లుగా సమాచారం. తనిఖీల్లో ఎక్కడా బాంబు సామగ్రి దొరకలేదు. పార్కింగ్ స్థలాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేశారు.

News January 8, 2026

NZB: 13 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్ట్

image

నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి పట్టుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ES మల్లారెడ్డి తెలిపారు. ADBకి చెందిన పూజ పవర్, డి.బాయి జాదవ్ లు MP లో గంజాయి కొనుగోలు చేసి MH కు చెందిన కిషన్ మోతిరామ్ దాలే, ఇంద్రజిత్ టాగ్రే లను కలుపుకొని, చద్మల్‌కు చెందిన మంజ వెంకట్రాంకు గంజాయిని ఇస్తుండగా CI స్వప్న ఆధ్వర్యంలో పట్టుకున్నామని వివరించారు.

News January 8, 2026

సంగారెడ్డి: రేపు టీఎన్జీవో జిల్లా ఎన్నికలు

image

సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో ఎన్నికలు ఈనెల 9న నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ తెలిపారు. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. ఎక్కువ మంది పోటీ చేస్తే ఎన్నికలు నిర్వహించి కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని పేర్కొన్నారు.