News April 4, 2025

సంగారెడ్డి జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

image

సంగారెడ్డి జిల్లాలో తహశీల్దార్లు బదిలీలు అయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న 17 మంది తహశీల్దార్లను  బదిలీ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  బదిలీ అయిన తహశీల్దార్లు శుక్రవారం విధుల్లో చేరాలని పేర్కొన్నారు. సాధారణ బదిలీలో భాగంగానే వీరిని బదిలీ చేసినట్లు చెప్పారు. ఖాళీగా ఉన్న చోట్ల నాయబ్ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Similar News

News April 19, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో 144 సెక్షన్: SP

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఈనెల 20 నుంచి నిర్వహించనున్న ఇంటర్, పదవ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్ష కేంద్రాల వద్ద BNSS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రశ్నాపత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కూడా పరీక్షా కేంద్రాల్లో ఉండరాదని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన వారిని తప్ప ఎవరినీ కేంద్రాలకు అనుమతించమన్నారు.

News April 19, 2025

మద్దూరు: సీఎం ఫోటోను అవమానపరిచినందుకు అరెస్ట్..!

image

కోటకొండ గ్రామానికి చెందిన కావలి వెంకటేష్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫోటోలను అవమానకరంగా ఎడిట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్ గ్రూపులలో ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఘటనపై రేణివట్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి యాసిన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 19, 2025

NZB: మద్యం తాగుతూ.. పాటలు వింటూ మృతి(UPDATE)

image

నగరంలోని సుభాష్ నగర్లో ఆటోలో మృతి చెందిన వ్యక్తిని న్యూ ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బాలచందర్(36)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆటోలో పాటలు వింటూ మద్యం సేవిస్తుండగా ఒకసారిగా ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని మార్చురీకి తరలించారు.

error: Content is protected !!