News February 3, 2025

సంగారెడ్డి: జిల్లాలో పెరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు

image

జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య తగ్గి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు పెరగనున్నాయి. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పాటు కొత్త మండలాల ఏర్పాటుతో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికారులు ఆయా మండలాల మాసాయిదా జాబితాను విడుదల చేశారు. 2019 ఎన్నికల సమయంలో జిల్లాలో 295 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 276, జడ్పీటీసీల సంఖ్య 27కు చేరింది.

Similar News

News November 16, 2025

విజయనగరం జిల్లాలో జాబ్ మేళా

image

AP:విజయనగరం జిల్లాలోని మహారాజ్ కాలేజీలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ITI, డిగ్రీ, పీజీ, ANM, GNM, BSc, MSc (నర్సింగ్), ఫార్మసీ ఉత్తీర్ణులై, 18- 45ఏళ్ల లోపు వారు అర్హులు. 280 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ కార్డ్ తప్పనిసరి. అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: employment.ap.gov.in

News November 16, 2025

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News November 16, 2025

గోపాల్‌పేటకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

image

వనపర్తి సంస్థానంలో భాగంగా 1711లో గోపాల్‌పేట సంస్థానం ఏర్పడింది. చరిత్ర ప్రకారం.. వనపర్తి, గోపాల్‌పేట ఉమ్మడి ప్రాంతాలను పూర్వం పానుగంటి సీమ అని పిలిచేవారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థానానికి, వనపర్తి, గోపాల్‌పేట సంస్థానాల మూలపురుషుడు జనంపల్లి వీరకృష్ణారెడ్డి పెద్ద కుమారుడైన వెంకటరెడ్డి గోపాలరావు పేరు మీదగా గోపాల్‌పేట అని పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.