News February 3, 2025
సంగారెడ్డి: జిల్లాలో పెరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు

జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య తగ్గి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు పెరగనున్నాయి. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పాటు కొత్త మండలాల ఏర్పాటుతో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికారులు ఆయా మండలాల మాసాయిదా జాబితాను విడుదల చేశారు. 2019 ఎన్నికల సమయంలో జిల్లాలో 295 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 276, జడ్పీటీసీల సంఖ్య 27కు చేరింది.
Similar News
News November 17, 2025
సినిమావాళ్ల కంటే మిరే నష్టపోతున్నారు: రాజమౌళి

పోలీసులకు సవాల్ చేసి.. భస్మాసుర హస్తంలా ఇమ్మడి రవి తన తల మీద తానే చెయ్యి పెట్టుకున్నాడని, ఏదీ ఊరికే రాదని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఐ బొమ్మలో ఫ్రీగా మూవీలు ఎలా వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించారా? మీ పర్సనల్ డేటా ఇమ్మడి రవి అమ్ముకుంటున్నాడు. అంత పెద్ద సర్వర్లు మెయింటెన్ చేయాలంటే ఎంతో డబ్బు కావాలి. ఆ డబ్బంతా మీరే ఇస్తున్నారు. మా సినిమా వాళ్లకంటే.. మీరే ఎక్కువగా నష్టపోతున్నారన్నారు.
News November 17, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 118 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మందు బాబులు వాహనాలు నడపడం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 118 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.
News November 17, 2025
ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన GWMC కమిషనర్

గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని మాట్లాడారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరార్థమై ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. GWMCలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


