News March 27, 2025

సంగారెడ్డి: ‘జిల్లాలో బడి లేని ఆవాసాలు 335’

image

సంగారెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సీఆర్పీలు నిర్వహించిన సర్వేలో 335 ఆవాస ప్రాంతాలలో బడులు లేనట్లుగా గుర్తించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష పరిధిలోని సీఆర్పీలు క్షేత్ర స్థాయికి వెళ్లి సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలు లేని ఆవసాలు 5, ప్రాథమికోన్నత పాఠశాలలు లేని ఆవసాలు 190, ఉన్నత పాఠశాలలు లేనివి 140గా గుర్తించారు.

Similar News

News November 22, 2025

హనుమకొండ: హిడ్మా ఫ్లెక్సీకి నివాళి.. ఇద్దరిపై కేసు నమోదు

image

HNK జిల్లా వేలేరు మండలం షోడశపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

News November 22, 2025

వనపర్తి: ఉడెన్ షటిల్ కోర్ట్ ,జిమ్ ప్రారంభానికి సిద్ధం

image

వనపర్తి ఇండోర్ స్టేడియంలో సుమారు రూ.20 లక్షలతో నిర్మించిన వుడెన్ షటిల్ కోర్ట్, జిమ్ ఈరోజు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ప్రారంభించనున్నారు. రూ.12 లక్షలతో ఉడెన్కోట్ రూ.7 లక్షలతో జిమ్, సుమారు లక్షన్నరతో స్టేడియం డయాస్‌పై టాప్ నిర్మించేందుకు ప్రభుత్వం ఖర్చు చేసిందని సంబంధిత అధికారి తెలిపారు. క్రీడాకారులకు వ్యాయామ చేసేవారికి ఎంతో ఉపయోగమన్నారు.

News November 22, 2025

జల, వాయు మార్గాల ద్వారా భారత్-అఫ్గాన్ ట్రేడ్

image

భారత్-అఫ్గాన్ మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. పాక్ రోడ్డు మార్గం మూసేయడంతో జల, వాయు మార్గాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవుతోపాటు రెండు ప్రత్యేక కార్గో విమానాలను ఉపయోగించుకోనున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం IND-AFG మధ్య బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుండగా, భవిష్యత్తులో మరింత పెంచనున్నాయి.