News January 27, 2025
సంగారెడ్డి జిల్లాలో మహిళ ఆత్మహత్య

వరకట్న వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆలంపల్లికి చెందిన పావని(27), నిజాంపూర్ వాసి సాయికిరణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త సాయి కిరణ్, అత్త, మరిది వేధింపులు తట్టుకోలేక ఆమె ఉరేసుకుని చనిపోయింది. సదాశివపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 27, 2025
కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

AP: దిత్వా తుఫాను ప్రభావంతో రేపు GNT, బాపట్ల, ప్రకాశం, NLR, ATP, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. ‘శనివారం అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతిభారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది’ అని పేర్కొంది.
News November 27, 2025
సిరిసిల్ల: ‘ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి’

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను శాంతియుత ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయా ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
News November 27, 2025
భూపాలపల్లి: ఆధార్ లేనివారు నమోదు చేసుకోవాలి: జేసీ

భూపాలపల్లి జిల్లాలో ఆధార్ లేని వ్యక్తులు వెంటనే నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లాలో సున్నా నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ నమోదు చేయించటంతోపాటు, అప్ డేట్ కూడా చేయించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయోమెట్రిక్
చేయించుకోవాలన్నారు.


