News March 13, 2025
సంగారెడ్డి జిల్లాలో మహిళ హత్య

ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఆమె వద్దనున్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామంలో జరిగింది. స్థానికులు, ASI..కథనం ప్రకారం గ్రామానికి చెందిన గౌరమ్మ (45)ను బుధవారం అర్ధరాత్రి ఎవరో హత్య చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి SP పరితోష్ పంకజ్ చేరుకొని పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.
Similar News
News April 16, 2026
కడెం: కూలర్ షాక్ కొట్టి మహిళ మృతి

కూలర్లో నీళ్లు పోస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. మద్దిపడగకు చెందిన కారం సుశీల (49) గురువారం ఇంట్లో కూలర్లో నీళ్లు పోస్తుండగా షాక్ తగిలి సుశీల అక్కడికక్కడే మృతి చెందింది. సుశీలను కాపాడబోయిన తన తండ్రి అబ్రహంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు.
News April 16, 2026
YouTube షార్ట్స్కు బానిస అయ్యారా? ఇలా చేస్తే కనిపించవు..

కొంత మంది గంటల తరబడి యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తారు. అలాంటి వారి కోసం స్క్రీన్ టైమ్ తగ్గించేలా యూట్యూబ్ డిజేబుల్ ఫీచర్ తీసుకొచ్చింది. దీని కోసం యూట్యూబ్ యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్లి టైమ్ మేనేజ్మెంట్ సెలక్ట్ చేసుకోవాలి. కింది భాగంలో ‘Shorts feed limit’ ఆన్ చేసి జీరో మినట్స్ ఎంచుకోవాలి. దీంతో మీకు ఇక షార్ట్స్ కనిపించవు. తిరిగి చూడాలి అనుకుంటే Shorts feed limit ఆఫ్ చేస్తే చాలు.
News April 16, 2026
గ్రామగ్రామాన సీఎం బర్త్ డే వేడుకలు: పూల నాగరాజు

సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఈనెల 20న గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని జిల్లా TDP అధ్యక్షుడు పూల నాగరాజు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మంత్రి నారా లోకేశ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.


