News March 10, 2025
సంగారెడ్డి జిల్లాలో 122 టెన్త్ పరీక్ష కేంద్రాలు

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 122 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంవత్సరం 22,411 మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
Similar News
News January 25, 2026
మంచిర్యాల: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం

వివాహితను ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. SI కథనం ప్రకారం.. లక్షెట్టిపేటలోని ఓ కాలనీకి చెందిన విడాకులు తీసుకున్న మహిళకు అదే ప్రాంతానికి చెందిన సాయికిరణ్ పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు పెళ్లి ప్రస్తావన తేగా నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు.
News January 25, 2026
విజయవాడలో కేజీ చికెన్ ధర ఎంతంటే!

విజయవాడలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 310, స్కిన్ రూ. 300 విక్రయిస్తున్నారు. డిమాండ్ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు విక్రయదారులు చెబుతున్నారు. మటన్ కేజీ రూ.1000గా ఉంది. చేపల్లో బొచ్చ కేజీ రూ. 220గా ఉంది. 30 కోడిగుడ్లు గతవారం రూ. 180 ఉండగా నేడు రూ. 152కి అమ్ముతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News January 25, 2026
BREAKING: డోన్లో గన్ మిస్ఫైర్.. కానిస్టేబుల్ మృతి

డోన్ రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న GRP కానిస్టేబుల్ పెద్దయ్య గన్ మిస్ఫైర్ కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో స్టేషన్ పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. గన్ మిస్ఫైర్ ఎలా జరిగిందన్న కోణంలో పరిశీలిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


