News April 9, 2025

సంగారెడ్డి జిల్లాలో 25 మంది నాయబ్ తహశీల్దార్ల బదిలీ

image

జిల్లాలో 25 మంది నాయబ్ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయినా నాయబ్ తహశీల్దార్లు వెంటనే వారికి కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. సాధారణ బదిలీలో భాగంగానే వీరిని బదిలీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. నాలుగు రోజుల క్రితం తహశీల్దార్లు బదిలీ కాగా తాజాగా నాయబ్ తహశీల్దార్లను బదిలీ చేశారు.

Similar News

News February 24, 2026

ఇంగ్లండ్‌తో పోరు.. పాక్ స్కోరు ఎంతంటే..?

image

T20 WC సూపర్-8లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాక్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 164-9 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్(63) రాణించగా, బాబర్ ఆజమ్(25), ఫఖర్ జమాన్(25) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 3, ఓవర్టన్, ఆర్చర్ తలో 2, రషీద్ ఒక వికెట్ తీశారు.

News February 24, 2026

7 లక్షల మంది ఆస్తిహక్కు పత్రాలు తీసుకోలేదు: అనగాని

image

AP: పేదలకు ఇళ్ల పేరిట గత ప్రభుత్వంలో ₹6,000 కోట్లు స్వాహా చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ‘22 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే 7 లక్షల మంది కన్వేయన్స్ డీడ్స్ (ఆస్తిహక్కు పత్రాలు) తీసుకోలేదు. చెరువులు, ముంపు ప్రాంతాల్లో స్థలాలివ్వడంతో 2.5 లక్షల మంది అసలు పట్టాలే తీసుకోలేదు. తీసుకున్న వారిలో 43,948 మంది అనర్హులున్నారు. మరో 1,11,037 పట్టాలను పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు.

News February 24, 2026

నెల్లూరు: నిద్ర మాత్రలు మింగి మహిళ సూసైడ్

image

నెల్లూరు నగరంలోని సెట్టిగుంట రోడ్డు సీపీఆర్ వీధిలో నివాసం ఉంటున్న సుజాత (51) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఇంట్లో సమస్యలు, అనారోగ్యం ఆమెను తీవ్రంగా కలిచి వేసింది. ఈనెల 22వ తేదీన తన ఇంట్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.