News April 15, 2025
సంగారెడ్డి జిల్లాలో 710 పాఠశాలలు ఎంపిక

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో యుడైస్ పోర్టులో నమోదు చేసిన విద్యార్థుల సంఖ్యను పరిశీలించడానికి జిల్లాలో 710 పాఠశాలలను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ.. 52 మంది డిఎడ్, బిఎడ్ చదువుతున్న విద్యార్థులు రేపటి నుంచి ఈనెల 21 వరకు ఎంపిక చేసిన పాఠశాలలను పరిశీలించనున్నారని పేర్కొన్నారు.
Similar News
News October 14, 2025
బాలికలు రాణిస్తేనే దేశం పురోగతి సాధిస్తుంది: జిల్లా జడ్జి

బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశం పురోగతిని సాధిస్తుందని జిల్లా జడ్జి పుష్పలత తెలిపారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయ సంబంధిత విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి బహుమతులు అందజేశారు. పాఠశాల సిబ్బంది, న్యాయసేవా సభ్యులు పాల్గొన్నారు.
News October 14, 2025
తెనాలి: రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్

తెనాలి చెంచుపేటలో సంచలనం రేకెత్తించిన జూటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. మృతుని స్వగ్రామం కోడితాడిపర్రులో సొసైటీ దేవాలయానికి సంబంధిన వ్యవహారంలో విభేదాల కారణంగా హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహానికి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు.
News October 14, 2025
బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. 71మంది అభ్యర్థులతో లిస్ట్ను విడుదల చేసింది. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <