News March 7, 2025

సంగారెడ్డి: జిల్లా ఎస్పీ రూపేశ్ బదిలీ

image

సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నా చెన్నూరి రూపేశ్‌ను నార్కోటిక్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పారితోష్ పంకజ్‌ను నియమించారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.

Similar News

News November 20, 2025

పెరిగిన చలి.. కోళ్ల సంరక్షణలో జాగ్రత్తలు(1/2)

image

ప్రస్తుతం రాత్రి వేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కోళ్ల పెంపకందారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో కోళ్లఫామ్‌ల గదుల్లో తేమ ఎక్కువగా ఉండి శిలీంద్రాలు పెరిగే ఛాన్సుంది. దీని వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కోళ్లకు సోకి, అవి మరణించే ప్రమాదం ఉంటుంది. అందుకే కోళ్లకు వెచ్చదనం ఉండేలా షెడ్డు చుట్టూ పరదాలు అమర్చాలి. ఇదే సమయంలో గాలి ప్రసరణ షెడ్‌లోకి సరిగా ఉండేలా చూసుకోవాలి.

News November 20, 2025

రూ.50లక్షలతో తీస్తే రూ.60కోట్లు వచ్చాయి!

image

కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు సినిమాను గెలిపిస్తారని గుజరాతీ ఫిల్మ్ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’తో మరోసారి రుజువైంది. కేవలం రూ.50లక్షలతో తీసిన ఈ సినిమా తొలుత తడబడినా.. కథపై మౌత్ టాక్ పెరిగి ఇప్పటికే రూ.60కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ‘లాలో’ అనే రిక్షా డ్రైవర్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని అంకిత్ సఖియా తెరకెక్కించగా కరణ్ జోషి ప్రధాన పాత్రలో నటించారు. ఈచిత్రం గత నెల 10న థియేటర్లలో విడుదలైంది.

News November 20, 2025

ధాన్యం ఆఖరి గింజ వరకూ కొంటాం: మంత్రి నాదెండ్ల

image

జిల్లాలోనే తొలిగా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర గురువారం ప్రారంభమైంది. రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు ధైర్యంగా ఉండాలని మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.