News March 7, 2025

సంగారెడ్డి: జిల్లా ఎస్పీ రూపేశ్ బదిలీ

image

సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నా చెన్నూరి రూపేశ్‌ను నార్కోటిక్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పారితోష్ పంకజ్‌ను నియమించారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.

Similar News

News January 7, 2026

KNR: ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి.. ఆరెంజ్ అలర్ట్ జారీ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 9.9℃గా నమోదు కావడంతో వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ములకాలపల్లిలో 10.1℃, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నెరేళ్లలో 10.3℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో 10.6℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 7, 2026

JNTU: వాయిదా పడిన బీ ఫార్మసీ పరీక్షలకు తేదీలు ఇవే!

image

JNTUకి సంబంధించి బీ ఫార్మసీ మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్‌తో పాటు, ఫస్ట్ సెమ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 27, 29న నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ డైరెక్టర్ వెల్లడించారు. నవంబర్ 4, 6వ తేదీన జరగవలసిన పరీక్షలు వాయిదా వేసిన నేపథ్యంలో నూతన తేదీలను ప్రకటించారు. దీనికి అనుగుణంగా అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.

News January 7, 2026

చిత్తూరు, తిరుపతి జిల్లాలో 600 ఉద్యోగాలు..!

image

SIPB సమావేశంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. తిరుపతిలో ఎథీరియల్ ఎక్స్‌ప్లోరేషన్ గిల్డ్ రూ.578 కోట్లు, నవ ఫుడ్ సెంటర్ రూ.44.42 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు గ్రీన్ సిగ్నల్ దక్కింది. మరోవైపు చిత్తూరు జిల్లాలో పయనీర్ క్లీన్ అంప్స్ సంస్థ రూ.159 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనుండగా.. దీనివల్ల సుమారు 600 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.