News March 25, 2025
సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల నిరసన

హైదరాబాద్లో న్యాయవాది ఇజ్రాయిల్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా కోర్టు ముందు భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
Similar News
News April 1, 2025
NZB: బిక్షాటన డబ్బులు ఎక్కువ వస్తున్నాయని బాలుడి హత్య

NZBలో 14 నెలల బాలుడు కైలాస్ హత్య కేసును వన్టౌన్ పోలీసులు చేధించారు. మహారాష్ట్రకు చెందిన బోస్లే మాలాబాయి, ఆమె కొడుకు గోపాల్ హత్య చేసినట్లు వన్టౌన్ SHO రఘుపతి తెలిపారు. పోలీసుల వివరాలు.. కమలాబాయి అనే మహిళకు బిక్షాటన చేసే సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని.. అదే సమయంలో వీరికి తక్కువ డబ్బులు రావడంతో కక్షతో ఈ నెల 27న రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న బాలుడిని తీసుకెళ్లి బండి రాయితో కొట్టి హత్య చేశారు.
News April 1, 2025
గ్రూప్ 1 ఫలితాలలో సత్తా చాటిన నారాయణపేట బిడ్డ

నారాయణపేట జిల్లా కేంద్రం యాదవనగర్కు చెందిన వీణ గ్రూప్ 1 ఫలితాలలో సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో 118వ ర్యాంక్, ఎస్టీ కేటగిరిలో మల్టీ జోన్-2 లో మూడో ర్యాంక్ సాధించింది. ఆమె మొదట 2024లో గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్గా ఎంపికైంది. 2025లో జూనియర్ లెక్చరర్గా ఎంపికై ప్రస్తుతం గోల్కొండ మహిళా కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు.
News April 1, 2025
కామారెడ్డి: WOW.. రాయిని చీల్చి.. వృక్షంగా ఎదిగి!

ప్రకృతి అంతులేని శక్తికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన దృశ్యం నిజాంసాగర్ శివార్లో కనిపించింది. నిశ్చలంగా కనిపించే ఒక పెద్ద బండరాయిని చీల్చుకుంటూ ఓ మొక్క మొలకెత్తి, నేడు ఎదిగి వృక్షంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, ఈ రాయిని చీల్చుకుని ఎదిగిన వృక్షం మనందరికీ ఒక గొప్ప సందేశాన్నిస్తోంది. అడ్డంకులు ఎంత పెద్దగా ఉన్నా, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చనే స్పూర్తినిస్తోంది.