News January 28, 2025

సంగారెడ్డి: టీచర్లకు ఈఎల్స్ మంజూరు: DEO

image

వేసవి సెలవుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు ఈఎల్స్ మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు మాత్రమే ఈఎల్స్ మంజూరు చేసినట్లు చెప్పారు. వీటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈఎల్స్ మంజూరు చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 17, 2025

HYD: ఆ పోస్ట్ అప్పుడే తొలగించాం: సీవీ ఆనంద్

image

నటుడు బాలకృష్ణపై సీవీ ఆనంద్ పెట్టిన ఓ ఎమోజీ వివాదాస్పదమైంది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడంతో సీవీ ఆనంద్ స్పందించారు. దాదాపు 2 నెలల క్రితం తన సోషల్ మీడియాను నిర్వహించే వ్యక్తి ఆ పోస్ట్ చేశారని చెప్పారు. వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించి, బాలకృష్ణకు క్షమాపణలు చెప్పానని స్పష్టంచేశారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ట్వీట్ చేశారు.

News November 17, 2025

సౌదీ బస్సు ప్రమాదం.. హెల్ప్‌లైన్ ఏర్పాటు

image

సౌదీలో జరిగిన ఘోర బస్సు <<18309348>>ప్రమాదంపై<<>> విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలో కాన్సులేట్‌లు బాధిత కుటుంబాలకు అండగా ఉంటాయన్నారు. మరోవైపు కేంద్రం హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఏదైనా సమాచారం కోసం 8002440003, 0122614093, 0126614276, +966556122301 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

News November 17, 2025

బల్కంపేట ఎల్లమ్మ గుడిలో కార్తీక పూజలు

image

పవిత్ర కార్తీక మాసంలో 4వ సోమవారం సందర్భంగా మహానగరంలోని పలు శివాలయాలు, ఇతర దేవాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివనామ స్మరణతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచే అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.