News February 17, 2025
సంగారెడ్డి: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో..!

MDK-KNR-NZB-ADB టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Similar News
News November 25, 2025
‘అఖండ-2’ మూవీకి అరుదైన ఘనత!

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ సినిమాను అవధి భాషలోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యే తొలి టాలీవుడ్ సినిమాగా నిలవబోతోందని పేర్కొన్నాయి. ఈ ఇండో-ఆర్యన్ భాషను UP, MPలోని పలు ప్రాంతాల్లో మాట్లాడుతారు. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కానుండగా వారణాసిలో CM యోగి గెస్ట్గా ఓ ఈవెంట్ నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
News November 25, 2025
లక్ష్మణుడి అగ్నిపరీక్ష గురించి మీకు తెలుసా?

ఓసారి లక్ష్మణుడు తనను కోరి వచ్చిన అప్సరసను తిరస్కరిస్తాడు. ఆగ్రహించిన ఆ అప్సరస తన నగలను మంచంపై వదిలి వెళ్తుంది. ఆ నగలను చూసిన సీతాదేవి లక్ష్మణుడి పవిత్రతను ప్రశ్నిస్తుంది. తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి లక్ష్మణుడు అగ్నిగుండంలో నడుస్తాడు. ఇలా లక్ష్మణుడు తన నిజాయితీని, పవిత్రతను రుజువు చేసుకుంటాడు. అయితే ఈ కథ జానపద రామాయణంలో నుంచి పుట్టిందని చెబుతారు.
News November 25, 2025
అయోధ్యలో నేడు కాషాయ జెండా ఎగరవేయనున్న PM మోదీ

అయోధ్య రామాలయంలో PM మోదీ నేడు కాషాయ జెండాను ఎగరవేయనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా 10 ఫీట్ల హైట్, 20 ఫీట్ల లెంగ్త్ ఉన్న ట్రయాంగిల్ ఫ్లాగ్ను ఆవిష్కరిస్తారు. దీనిపై సూర్యుడు, కోవిదార చెట్టు చిత్రాలు, ఓం సింబల్ ఉంటాయి. రామ మందిరానికి 2020 AUG 5న భూమిపూజ, 2024 JAN 22న రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. కాగా నేడు ధ్వజారోహణ ఉత్సవం నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.


