News March 18, 2025

సంగారెడ్డి: టెన్త్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి

image

ఈ నెల 21 నుంచి సంగారెడ్డి జిల్లాలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని వయోజన విద్యా శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్న ఉషారాణిని నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు జిల్లాలోని పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.

Similar News

News March 18, 2025

రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

AP: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. రేపు 58 మండలాల్లో, ఎల్లుండి 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని <>APSDMA<<>> వెల్లడించింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా చూసుకోవాలని హెచ్చరించింది. డీహైడ్రేట్ కాకుండా ORS, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచించింది.

News March 18, 2025

ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*ఏలూరు జిల్లాలో ముగిసిన ఇంటర్ థియరీ పరీక్షలు
*శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
* పెదపాడు: MEO- టీచర్‌ను మందలించిన కలెక్టర్
*ఎంపీ కృషితో కుక్కునూరు- భద్రాచలం రోడ్డు పనులు ప్రారంభం
*నూజివీడు: పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు
*చింతలపూడి: బ్రిడ్జి కూలుతోందని యువకుల ధర్నా
*కామవరపుకోటలో బైక్ చోరీ
*అగిరిపల్లెలో షార్ట్ సర్క్యూట్.. కోళ్ల ఫారం దగ్ధం
*జీలుగుమిల్లిలో ఓ వ్యక్తిపై దాడి

News March 18, 2025

కావలి గ్రీష్మ రాజీనామాకు ఆమోదం

image

AP: ఏపీ మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పదవికి కావలి గ్రీష్మ ఈ నెల 9న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించగానే ఆమె రాజీనామా చేశారు. ఇటీవల ఆమె ఆ కోటాలో MLCగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం గ్రీష్మ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

error: Content is protected !!