News March 18, 2025

సంగారెడ్డి: టెన్త్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి

image

ఈ నెల 21 నుంచి సంగారెడ్డి జిల్లాలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని వయోజన విద్యా శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్న ఉషారాణిని నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు జిల్లాలోని పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.

Similar News

News March 18, 2025

జడ్చర్ల బస్టాండ్‌లో దొంగలు.. జర జాగ్రత్త..!

image

సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడుతున్న దొంగలను మంగళవారం జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్‌లో సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. విజిలెన్స్ సెక్యూరిటీ లింగంపేట శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. బస్టాండ్‌లో ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా పట్టుబడ్డ నిందితులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి నుంచి 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

News March 18, 2025

మహబూబ్‌నగర్: దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ

image

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం భవిత సెంటర్లలో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని సమగ్ర శిక్ష సమావేశ మందిరంలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. భవిత సెంటర్లలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణను దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలన్నారు.

News March 18, 2025

మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్, GWMC కమిషనర్

image

హసన్పర్తిలోని దేవాదుల ప్యాకేజీ 3లో భాగంగా నూతనంగా నిర్మించిన పంపు హౌస్ మోటార్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభానికి వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ ప్రావిణ్య బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే కలిశారు.

error: Content is protected !!