News February 16, 2025
సంగారెడ్డి: డీఎస్సీ 2008 అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించిన డీఈవో

జిల్లాలో డీఎస్సీ 2008 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధి కారి వెంకటేశ్వర్లు శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. ఎంపికైన అభ్యర్థులకు నూతన పాఠశాలలు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి వెంకటేశం, ఎడి శంకర్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 18, 2025
జగిత్యాల: ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డుకు ఆత్మీయ వీడ్కోలు

జిల్లా పోలీస్ శాఖలో 25 సంవత్సరాలుగా హోంగార్డుగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందుతున్న రాములును జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో అంకితభావంతో పని చేసి అందరి మన్ననలు పొందారని శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ విరమణ పొందినందున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.
News March 18, 2025
నల్గొండ: ఇంటర్మీడియట్ పరీక్షలో 675 మంది విద్యార్థుల గైర్హాజరు

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈవో దశ్రు నాయక్ తెలిపారు. సోమవారం ఫిజిక్స్ వన్, ఎకనామిక్స్ వన్ పరీక్షలు జరిగాయని చెప్పారు. 15,316 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 14,641 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 675 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు.
News March 18, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి TOP NEWS!

@కలెక్టరేట్ ప్రజావాణిలో 35 ఫిర్యాదులు@జగిత్యాలలో అక్రమ నిర్మాణంపై ప్రజావాణిలో ఫిర్యాదు @బీర్పూర్ లో ప్రజలను ఆకట్టుకున్న బుర్రకథ @రాయికల్ లోని ప్రభుత్వ పాఠశాలలో తల్లితండ్రుల ఆశీర్వాదం తీసుకున్న 10వ తరగతి విద్యార్థులు @కోరుట్లలో RTC ఉద్యోగులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ @మల్యాలలో KCR చిత్రపటానికి పాలాభిషేకం @ధర్మపురిలో LRS రద్దు చేయాలని BRS నాయకుల నిరసన