News March 3, 2025
సంగారెడ్డి: తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తెల్లాపూర్లోని దివినో విల్లాస్లో తల్లి రాధిక(52)పై కొడుకు కార్తీక్ రెడ్డి కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించాగా…ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధిక చనిపోయిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని చెప్పారు.
Similar News
News March 15, 2025
సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన యోజిత అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 15, 2025
RCB: ఈసారైనా కప్ నమ్దేనా..!

IPL ఆరంభం నుంచి టైటిల్ కోసం RCB విశ్వప్రయత్నాలు చేస్తోంది. 17 సీజన్లు గడిచినా అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈసారైనా ఆ జట్టు కప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తనదైన రోజు ఏ జట్టునైనా ఓడించగలిగే RCBలో కోహ్లీ, పాటీదార్, లివింగ్స్టోన్, సాల్ట్, బేథేల్, జితేశ్, డేవిడ్ లాంటి హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్లోనూ యశ్ దయాల్, భువీ, ఎంగిడి, హేజిల్వుడ్, తుషార్ ఉన్నారు. మరి RCB ఈసారి కప్ కొడుతుందా?
News March 15, 2025
BREAKING: ఉప్పల్ సమీపంలో రోడ్డుప్రమాదం

డీసీఎం, బైక్ ఢీకొనటంతో ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఉప్పల్ భగాయత్ పరిధి ఫైర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగింది. ఉప్పల్ నుంచి నాగోల్ వైపు భగాయత్ మీదుగా వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి బైక్పై ప్రయాణిస్తూ వెళుతుండగా వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టినట్లు అక్కడి వారు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.