News April 9, 2025

సంగారెడ్డి: తల్లిని వేధిస్తుండని చంపేశాడు

image

SRD జిల్లా మొగుడంపల్లి మం. ధనశ్రీలో జరిగిన మహమ్మద్ అబ్బాస్ అలీ(25) <<16017699>>హత్య<<>> కేసును చిరాగ్‌పల్లి పోలీసులు ఛేదించారు. DSP రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాలు.. తన తల్లిని అబ్బాస్ వేధిస్తున్నాడని ఈనెల 6న ఖలీల్ షా, తన స్నేహితుడు మమ్మద్ బిస్త్‌తో కలిసి హత్య చేశారు. అడ్డొచ్చిన షేక్ అక్బర్ అలీపై బాటిల్‌తో దాడి చేశారు. నిందితులు పారిపోతూ అటుగా వచ్చిన మరో వ్యక్తిని గన్‌తో బెదిరించి అతడి బైక్‌పై పారిపోయారు.

Similar News

News October 26, 2025

ఖమ్మం: మనోళ్లు జూబ్లీహిల్స్‌లో బిజీ

image

జూబ్లీహిల్స్‌లో ఖమ్మం నాయకులు బిజీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల స్టార్ క్యాంపెయినర్లుగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు క్యాంపెయిన్ చేస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధుకు బీఆర్ఎస్ ప్రచార బాధ్యతలు అప్పగించింది.

News October 26, 2025

SPMVV: ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్ ప్రారంభం

image

SPMVVలో UG/ PG కోర్సుల్లో మూడో విడత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని కార్యాలయం పేర్కొంది. మొదటి రెండు విడతల్లో సీట్లు పొందని వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. B.Voc ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూట్రిషన్ హెల్త్ కేర్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు నేటి(ఆదివారం)లోగా https://oamdc-apsche.aptonline.in/OAMDC202425/Index పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

News October 26, 2025

ఏలూరు: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

image

కుటుంబ కలహాల నేపథ్యంలో ఏలూరు రూరల్ మారుతీ నగర్‌కు చెందిన కూలీ సుందరమతి దుర్గారావు (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. 15 రోజుల కిందట భార్య పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లగా, మనస్తాపంతో శనివారం రాత్రి దుర్గారావు ఇంటి వద్ద ఉరి వేసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ తెలిపారు.