News July 30, 2024
సంగారెడ్డి: దిగివచ్చిన టమాట ధర.. సామాన్యులకు ఊరట

సంగారెడ్డి: టమాట ధర ఎట్టకేలకు దిగి రావడంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది. సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట, తదితర మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 50 నుంచి రూ. 40 పలుకుతుంది. కిలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, బెండకాయ, ఆకు కూరగాయల ధరలు అలాగే ఉన్నాయి. ధరల పెరుగుదలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Similar News
News December 20, 2025
MDK: నాడు భార్య.. నేడు భర్త సర్పంచ్

వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్గా వంచ భూపాల్ రెడ్డి గెలవగా గతంలో ఆయన భార్య భాగ్యమ్మ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఒకే కుటుంబంలో భార్య, భర్త సర్పంచ్లుగా అవకాశం రావడం అరుదు అని గ్రామస్థులు అన్నారు. బుధవారం జరిగిన ఎన్నికలలో భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.
News December 20, 2025
మెదక్: నాడు తండ్రి.. నేడు కొడుకు సర్పంచ్

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో నాడు తండ్రి సర్పంచ్ కాగా.. నేడు తనయుడు సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ముప్పిరెడ్డిపల్లి సర్పంచ్గా కందాల రాజ నర్సింహా విజయం సాధించగా ఆయన తండ్రి కందాల సాయిలు గతంలో ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచారు.
News December 19, 2025
మెదక్: ‘అప్రమత్తతో ప్రాణ నష్ట నివారణ’

ముందస్తు అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణత్యాగాలు నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. పకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ నిర్వాహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. 22న నిర్వహించే మాక్ ఎక్సర్సైజ్ విజయవంతం చేయాలని సూచించారు.


