News July 7, 2024

సంగారెడ్డి: నాటి పూర్వ విద్యార్థులే.. నేడు టీచర్లు

image

సంగారెడ్డి జిల్లా జోగిపేట బాలుర ఉన్నత పాఠశాల నాటి(పూర్వ) విద్యార్థులే నేడు టీచర్లు అయ్యారు. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మందికి ఆ ఛాన్స్ వచ్చింది. ఇటీవలి పదోన్నతులు, బదిలీల్లో వీరంతా జోగిపేటకు వచ్చారు. చిన్నప్పుడు చదువుకున్న బడిలోనే ఇప్పుడు పాఠాలు నేర్పే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఇలాంటి ఓ రోజు వస్తుందని ఊహించలేదని టీచర్లు మాణయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్(PD), రమేశ్ కుమార్ అన్నారు.

Similar News

News December 2, 2025

మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 2, 2025

మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 2, 2025

MDK: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిషేధం: ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలు ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు, రాస్తారోకోలు నిషేధమని, చట్టవ్యతిరేక, అశాంతి సృష్టించే చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసుల చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.