News March 19, 2025

సంగారెడ్డి: నిమ్జ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ఏర్పాటు కోసం అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిమ్జ్ ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్ నియోజకవర్గాల రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. సమావేశంలో ప్రత్యేక అధికారి రాజు, జహీరాబాద్ ఆర్డీవో రామిరెడ్డి పాల్గొన్నారు.

Similar News

News September 17, 2025

JAM-2026కు దరఖాస్తు చేశారా?

image

<>JAM<<>>-2026కు దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 12 ఆఖరు తేదీ. ఐఐటీల్లో బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌ విభాగంలో పీజీలో ప్రవేశం పొందవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.2000(రెండు పేపర్లకు రూ.2700), మహిళలు, SC, ST, దివ్యాంగులు రూ.1000 (రెండు పేపర్లకు రూ.1,350) చెల్లించాలి.

News September 17, 2025

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 పోస్టులు

image

పుణేలోని బ్యాంక్ ఆఫ్ <>మహారాష్ట్ర<<>> 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, బీఈ, MSc, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1180కాగా, SC, ST, దివ్యాంగులు రూ.118 చెల్లించాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

News September 17, 2025

చిత్తూరు: ఐటీఐలో అడ్మిషన్ల ప్రారంభం

image

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు నాలుగో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు www.iti.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు ఈనెల 29న, ప్రైవేట్ విద్యార్థులకు 30వ తేదీన కౌన్సెలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని ఐటీఐని సంప్రదించాలని సూచించారు.