News March 13, 2025

సంగారెడ్డి: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. సంగారెడ్డిలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తి పన్ను వసూలు చేయాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్‌పై కూడా ప్రజలకు అవగాహన కల్పించి రెగ్యులర్ చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.

Similar News

News December 7, 2025

కోటగుళ్లలో సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యేక పూజలు

image

గణపురం మండలం కోటగుళ్లలోని గణపేశ్వరాలయంలో ఆదివారం భూపాలపల్లి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, అర్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి తీర్థప్రసాదాల అందజేశారు.

News December 7, 2025

గద్వాల ఫ్లై ఓవర్ వద్ద సూచిక బోర్డు ఏర్పాటు

image

గద్వాల ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రవీంద్ర పాఠశాల పూర్వ విద్యార్థులు కలిసి ఒక సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదని, ఆ సమయంలో అవి ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లాలని ఈ బోర్డు ద్వారా సూచించారు.

News December 7, 2025

అన్ని జిల్లాల్లో క్రీడా పోటీలు: ACA అధ్యక్షుడు చిన్ని

image

AP: రాష్ట్రంలో శాప్‌తో కలిసి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని క్రీడలను ప్రోత్సహిస్తామని MP, ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. అన్ని జిల్లాల్లో క్రీడా పోటీలు నిర్వ‌హించేందుకు CM CBN కృషి చేస్తున్నారని తెలిపారు. కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి 87వ సీనియ‌ర్ నేష‌న‌ల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లోగో, పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కాగా ఈ పోటీలు విజయవాడలో ఈ నెల 22 నుంచి 28 వరకు జరగనున్నాయి.