News March 23, 2025

సంగారెడ్డి: నేటితో ముగియనున్న గడువు: డీఈవో

image

యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలని ఉద్దేశంతో ఇస్రో వారు నిర్వహిస్తున్న యువికాలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుందని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఇస్రో వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భావి భారత పౌరులుగా తయారు కావడానికి ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు.

Similar News

News March 29, 2025

TODAY HEADLINES

image

✒ మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపం.. దాదాపు 180 మంది మృతి
✒ భూకంప ప్రభావిత దేశాలకు అండగా ఉంటాం: మోదీ
✒ కేంద్ర ఉద్యోగులకు 2% DA పెంపు
✒ AP: 31న జరగాల్సిన టెన్త్ పరీక్ష APR 1కి వాయిదా
✒ తెలుగువారే అగ్రస్థానంలో ఉండాలి: CBN
✒ ఓబుళాపురం మైనింగ్ కేసుపై మే 6న తీర్పు
✒ ఇంటి స్థలం లేని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు: పొంగులేటి
✒ మా శ్రమతోనే BYD రాష్ట్రానికి వచ్చింది: KTR
✒ మే 1 నుంచి ATM ఛార్జీల పెంపు

News March 29, 2025

నోటిఫికేషన్ విడుదల

image

AP: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (PGECET) నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీటెక్/బీఫార్మసీ పాసైన లేదా చివరి ఏడాది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. 120 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది.

News March 29, 2025

ఆర్సీబీ చేతిలో చెన్నై చిత్తు

image

IPL: సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన బెంగళూరు.. చెన్నైని సునాయాసంగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB 20 ఓవర్లలో 196/7 రన్స్ చేసింది. అనంతరం చెన్నై 146 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 50 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రచిన్ ఒక్కడే 41 పరుగులతో రాణించారు. చివర్లో ధోనీ (30*) రెండు సిక్సర్లు కొట్టి అభిమానుల్లో జోష్ నింపారు.

error: Content is protected !!