News March 23, 2025

సంగారెడ్డి: నేటితో ముగియనున్న గడువు: డీఈవో

image

యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలని ఉద్దేశంతో ఇస్రో వారు నిర్వహిస్తున్న యువికాలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుందని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఇస్రో వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భావి భారత పౌరులుగా తయారు కావడానికి ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు.

Similar News

News October 26, 2025

పెద్దపులి తిరిగి తిప్పేశ్వర్ కు వరకు వెళ్లిందా..!

image

కొన్ని రోజుల క్రితం బోథ్ మండలాన్ని గడగడలాడించిన పెద్దపులి ఆనవాళ్లు కనిపించడం లేదు. అది తిరిగి తన సొంతగూడు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతానికి వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం నిగిని, మర్లపల్లి అడవిలో కనిపించినట్లు అటవీ అధికారులు ధృవీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈమధ్య దాని ఆనవాళ్లు కనబడడం లేదు.

News October 26, 2025

OTTలోకి ‘కాంతార: ఛాప్టర్-1’ వచ్చేది అప్పుడేనా?

image

‘కాంతార ఛాప్టర్-1’ సినిమా ₹800Cr+ గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ హిందీ, కన్నడ భాషల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. కాగా ఈ సినిమా హిందీ వెర్షన్ మినహా మిగతా దక్షిణాది భాషల్లో ఈ నెలాఖరున OTT( అమెజాన్ ప్రైమ్ వీడియో)లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News October 26, 2025

‘డ్రై డే’ పాటిద్దాం.. అంటువ్యాధులను అరికడదాం: వైద్యాధికారి

image

అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధుల నుంచి ప్రజలను కాపాడాలని జిల్లా వైద్యాధికారి ధనరాజ్ సూచించారు. శనివారం ఆయన బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు పట్టిక, ఫార్మసీ గది, ల్యాబ్ తీరును పరిశీలించారు. దోమ కాటు ద్వారా సంభవిస్తున్న మలేరియా, డెంగ్యూ నివారణ కోసం ‘డ్రై డే’ పాటించేలా ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు.