News January 28, 2025
సంగారెడ్డి: నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో పనిచేస్తూ డీఆర్పీలుగా ఎంపికైన ఉపాధ్యాయులకు నేటి నుంచి రెండు రోజులపాటు ఐఎఫ్పీఎస్ పై హైదరాబాద్లోని టీఆర్ఆర్ రాజేంద్రనగర్లో శిక్షణ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ఎంపికైన ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 16, 2025
MNCL: ఓటర్ కార్డు దరఖాస్తులను పరిష్కరించాలి

రాష్ట్రంలో నూతన ఓటర్ కార్డులు ఓటర్ జాబితా సంబంధిత దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాదు నుంచి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో 100 వయసు పైబడిన ఓటర్లను గుర్తించాలని, వారి వివరాలను తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు.
News October 16, 2025
ఖమ్మం: ‘వైద్య పరీక్షలకు బయటకు పంపితే కఠిన చర్యలు’

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలో నెలకు కనీసం 200 ప్రసవాలు, ఓపీ కేసుల్లో 60% పరీక్షలు చేయాలన్నారు. వైద్య పరీక్షల కోసం రోగులను బయటకు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అవసరమైన పరికరాల ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆదేశించారు.
News October 16, 2025
గుంటూరు జిల్లాలో 173 న్యూసెన్స్ కేసులు: ఎస్పీ

గుంటూరు జిల్లా వ్యాప్తంగా నైట్ టైమ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నైట్ టైమ్లో అనవసరంగా తిరుగుతున్న 181 మందిపై 173 న్యూసెన్స్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఓపెన్ డ్రింకింగ్, రోడ్లపై అనవసరంగా తిరుగుతూ, ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.