News January 30, 2025
సంగారెడ్డి: నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గురువారం నుంచి రెండు రోజుల పాటు కెరీర్ గైడెన్స్ పైన శిక్షణ ఇస్తున్నారు. సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ శిక్షణకు ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు హాజరు కావాలని చెప్పారు.
Similar News
News November 9, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ(<
News November 9, 2025
లైట్హౌస్ పేరెంటింగ్ గురించి తెలుసా?

పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు రకరకాల పద్దతుల ఉపయోగిస్తారు. వాటిలో ఒకటే లైట్హౌస్ పేరెంటింగ్. ఈ పద్ధతిలో పిల్లలు జీవితంలో అన్నిట్లో రాణించాలని పేరెంట్స్ అనుకుంటారు. ఆరోగ్యం, ఆనందం, విజయం వైపు వెళ్లడానికి వారికి మద్దతుగా నిలుస్తారు. ఇది పిల్లలు నేర్చుకోవడానికి, సానుకూలంగా ఎదగడానికి సాయపడుతుంది. పిల్లలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ వారికి తోడుగా ఉంటారు. దీన్నే డాల్ఫిన్ పేరెంటింగ్ అని కూడా అంటారు.
News November 9, 2025
హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ప్రజల్లో 80% హిందువులు BJP వైపు ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై CM రేవంత్ సెటైర్లు వేశారు. ‘ఈ ఎన్నికల్లో BJP డిపాజిట్ పోతుంది. రాసిపెట్టుకోండి. మీరు ఓడిపోతే హిందువులు మీతో లేరు అని భావించాలి’ అని ఛాలెంజ్ విసిరారు. BRS గెలుపు కోసం జూబ్లీహిల్స్లో BJP పనిచేస్తోందన్నారు. BRS విలీనమైతే వచ్చే లాభంపై ఇక్కడ రెండు పార్టీలు లిట్మస్ టెస్ట్ చేసుకుంటున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


