News February 12, 2025
సంగారెడ్డి: నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన.. 15 నుంచి క్లాసులు

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇవ్వనున్న బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ముగిసిందని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ తెలిపారు. ఈనెల 12 నుంచి 14 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తామన్నారు. అనంతరం అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన వారికి ఈనెల 15 నుంచి తరగతులు జరుగుతాయన్నారు.
Similar News
News November 5, 2025
తెనాలి: ప్రైవేట్ హాస్పటల్ వైద్యురాలి ఇంట్లో భారీ చోరీ..!

తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. లాకర్ లోని ఐదు బంగారు బిస్కెట్లు, రూ. 5.50 లక్షల నగదు మాయమవడంతో త్రీ టౌన్ పోలీసులకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. మొత్తం రూ. 64.50 లక్షల సొత్తు చోరీ జరిగినట్లు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 5, 2025
NTR: రాజా వారి పాట చాలా కాస్ట్ లీ గురూ..!

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 8న జరగనున్న ఇళయరాజా కచేరీకి టికెట్ల ధరలు భారీగా ఉండటం విమర్శలకు దారి తీసింది. మీట్ & గ్రీట్ కోసం రూ. 79 వేలు, ముందు వరుసలకు రూ. 59 వేల నుంచి విక్రయిస్తున్నారు. ప్రైవేట్ కార్యక్రమాల కోసం కంకర పోయడంతో గ్రౌండ్ దెబ్బతిని, క్రీడాకారులు గాయపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి.
News November 5, 2025
హన్స్రాజ్ కాలేజీలో ఉద్యోగాలు

ఢిల్లీలోని హన్స్రాజ్ కాలేజీ 24 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 21లోపు అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా, మిగతా పోస్టులకు 32ఏళ్లు. వెబ్సైట్: https://hansrajcollege.ac.in/


