News February 12, 2025
సంగారెడ్డి: నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన.. 15 నుంచి క్లాసులు

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇవ్వనున్న బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ముగిసిందని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ తెలిపారు. ఈనెల 12 నుంచి 14 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తామన్నారు. అనంతరం అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన వారికి ఈనెల 15 నుంచి తరగతులు జరుగుతాయన్నారు.
Similar News
News November 16, 2025
కార్మికులపై CBN వ్యాఖ్యలు దారుణం: రామకృష్ణ

AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్పై CM చంద్రబాబు <<18299181>>వ్యాఖ్యలను<<>> ఖండిస్తున్నామని CPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. కార్మికులు పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారనడం దారుణమన్నారు. ఆయన మాటలు తెలుగు జాతిని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. వెంటనే ఆ వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్సెలార్ మిట్టల్కు క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు కానీ విశాఖ స్టీలుకు ఎందుకు అడగరని ప్రశ్నించారు.
News November 16, 2025
స్థిరాస్తి లాటరీల మోసం.. అధికారులు దృష్టి సారించాలి

ఖమ్మం జిల్లాలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘1000 కట్టు-ఫ్లాటు పట్టు’ వంటి మోసపూరిత ప్రకటనలతో లాటరీలు నిర్వహిస్తూ ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరహా ఆర్థిక మోసాలను అరికట్టడానికి అధికారులు, పోలీసు యంత్రాంగం వెంటనే దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అమాయక ప్రజలను ఈ మోసాల నుంచి రక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.
News November 16, 2025
తూ.గో: మూడేళ్లుగా కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి

పెరవలి మండలంలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల కుమార్తెపై కన్న తండ్రే మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చడంతో తల్లికి ఈ విషయం తెలిసింది. ఆమె భర్తను నిలదీయగా వివాదం జరిగింది. బాధితురాలు తన తల్లితో కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పెనుమంట్రలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును పెరవలి స్టేషన్కు బదిలీ చేశారు.


