News February 12, 2025

సంగారెడ్డి: నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన.. 15 నుంచి క్లాసులు

image

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇవ్వనున్న బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ముగిసిందని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ తెలిపారు. ఈనెల 12 నుంచి 14 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తామన్నారు. అనంతరం అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన వారికి ఈనెల 15 నుంచి తరగతులు జరుగుతాయన్నారు.

Similar News

News November 23, 2025

గుంటూరు: రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శ్రీనివాసరావు

image

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నామినేటెడ్ పదవుల కేటాయింపులో గుంటూరుకు ప్రాధాన్యత దక్కింది. ఈమేరకు రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కళ్యాణం శివ శ్రీనివాసరావు నియమితులయ్యారు. జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్‌గా ప్రస్తుతం ఆయన పని చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరు పొందారు. ఆయన నియామకం పట్ల జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

News November 23, 2025

సిరిసిల్ల: విధేయతకు పట్టం కట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం

image

1982లో యూత్ కాంగ్రెస్‌లో చేరిన సంగీతం శ్రీనివాస్ 44ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఈయన ఉమ్మడి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, OBC రాష్ట్ర కమిటీ, PCC సభ్యుడిగా పని చేశారు. సిరిసిల్ల మార్కెట్ కమిటి ఛైర్మన్‌గా సేవలందించారు. 10 సంవత్సరాలు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి, రాజన్న సిరిసిల్ల DCC అధ్యక్షుడు అయ్యారు.

News November 23, 2025

MBNR: సైబర్ మోసాలు.. నిందితులు వీరే..!

image

సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి తెలిపారు.1.జర్పుల సురేందర్,2.కాట్రావత్ హనుమంతు,3.వడ్త్యా రాజు,4.వత్య భాస్కర్,5.కాట్రావత్ నరేష్,6.రాత్లావత్ సంతోష్,7.రాత్లావత్ సోమల వీరంతా తువ్వగడ్డ తండా, జై నల్లిపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. MBNR, WNP టీమ్‌ల సహకారంతో లొకేషన్ ట్రాక్ చేసి అరెస్టు చేశారు. విచారణ అనంతరం జుడిషియల్ రిమాండ్‌కు పంపారు.