News February 17, 2025

సంగారెడ్డి: నేటి నుంచి విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు

image

పాఠశాలలో చదివే విద్యార్థులకు నేటి నుంచి మార్చి 15వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి సోమవారం. సంగారెడ్డి జనరల్ హాస్పిటల్, జోగిపేట, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్‌లో కంటి వైద్య పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మొబైల్ హెల్త్ టీం వాహనాల్లో రోజుకు 50 మంది విద్యార్థులు తరలించి కంటి వైద్య పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News February 26, 2026

సిద్దిపేట: 3,887 ఎకరాల్లో పంట నష్టం

image

సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు 40 గ్రామాల్లోని 1,998 మంది రైతులు నష్టపోయారు. మొత్తం 3,887 ఎకరాల్లో మొక్కజొన్న(2,356 ఎకరాలు), సన్‌ఫ్లవర్(1,531 ఎకరాలు) పంటలు దెబ్బతిన్నాయి. తొగుట మండలంలో డీఏవో స్వరూప రాణి క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. ఈ నివేదికను కలెక్టర్‌కు సమర్పించి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బాధితులను ఆదుకుంటామని ఆమె రైతులకు హామీ ఇచ్చారు.

News February 26, 2026

‘టాక్సిక్’ రన్‌టైమ్ షాక్.. 2 పార్ట్‌లుగా రానుందా?

image

రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ రన్‌టైమ్‌పై వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా నిడివి కేవలం 2:20 గంటలేనన్న టాక్ నడుస్తోంది. ఇంత తక్కువ టైమ్‌లో భారీ కథను చూపించడం కష్టమని అందుకే రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే చర్చ మొదలైంది. ఒకవేళ రన్‌టైమ్ నిజంగా తక్కువే ఉంటే ‘టాక్సిక్ 2’ పక్కా అని SMలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

News February 26, 2026

గురువార వ్రత కథ

image

దయావంతుడనే ధనవంతుడు దానధర్మాలు చేసేవాడు. భార్యకు ఇవేం ఇష్టం లేదు. ఓరోజు బృహస్పతి సాధువుగా వచ్చి భిక్ష అడిగాడు. ఆమె సంపదంతా పోయి ప్రశాంతంగా ఉండాలని కోరింది. సాధువు చెప్పినట్లు ఆమె ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించి, దరిద్రం అనుభవించింది. ఆ తర్వాత పొరుగున ఉన్న పుణ్యస్త్రీ సలహాతో తన తప్పు తెలుసుకుని ఈ వ్రతం చేసింది. దీంతో బృహస్పతి ప్రసన్నుడై వారికి తిరిగి ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు.