News June 29, 2024

సంగారెడ్డి: నేడు తార డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా

image

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. SHARE IT

Similar News

News October 13, 2025

మెదక్: బాణాసంచ విక్రయాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక టపాకాయల (బాణాసంచా) దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు ముందస్తుగా అనుమతి పొందడం తప్పనిసరి అని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. వ్యాపారులు తమ దరఖాస్తులను సంబంధిత సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. మార్గదర్శకాల కోసం కూడా సబ్ డివిజన్ పోలీస్ అధికారిని సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు.

News October 12, 2025

మెదక్: సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

image

ప్రజలు సైబర్ నేరాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. లోన్ యాప్‌లు, జాబ్ ఫ్రాడ్‌లు, ఏపీకే ఫైల్స్‌తో డాటా చోరీ, క్రిప్టో కరెన్సీ పెట్టుబడి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ మోసాలకు గురైతే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని ఎస్పీ కోరారు.

News October 12, 2025

మెదక్: మీ వ్యక్తిగత డేటాకు గ్యారంటీ లేదు.. జర జాగ్రత్త..!

image

ఇంట్లో వాడి వదిలేసిన ఫోన్లను మొబైల్ షాపులకు లేదా తెలియని వ్యక్తులకు అమ్మడం ప్రమాదకరమని MDK అధికారులు సూచిస్తున్నారు. నేరగాళ్లు ఆ ఫోన్లలోని IMEI నంబర్లు, మదర్ బోర్డులు, సాఫ్ట్‌వేర్ సేకరించి సైబర్ మోసాలకు వినియోగిస్తున్నారని, ఈ పరికరాల ద్వారా బ్యాంక్ మోసాలు, డేటా చోరీలు, ఆన్‌లైన్ నేరాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. పాత మొబైల్ అమ్మే ముందు డేటాను పూర్తిగా డిలీట్ చేసి, ఫ్యాక్టరీ రీసెట్ చేయాలన్నారు.