News October 14, 2024
సంగారెడ్డి: నేడు దామోదర్ రాజనర్సింహ పర్యటన

అందోల్ నియోజకవర్గంలోని చౌటకుర్ మండలం తాడ్దన్ పల్లిలోని యంఏస్ ఫంక్షన్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నేడు ఉ.11 గంటల నుంచి ఆలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News December 13, 2025
ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి.. జాగ్రత్తగా ఉండండి

ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా కోహిర్ 6.1, మల్చెల్మ 7.0, మెదక్ జిల్లా దామరంచ 8.2, వెల్దుర్తి 9.0, సిద్దిపేట జిల్లా తిప్పారం 8.3, పోతారెడ్డి పేట 8.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలోనమోదయ్యాయి. చలి తీవ్ర దృష్ట్యా గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, ఆస్తమా రోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News December 12, 2025
ప్రచారం ముగిసింది.. ప్రలోభం మిగిలింది !

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక ఓటర్లను ప్రభావితం చేయడం మిగిలింది. మెదక్ నియోజకవర్గంలో మెదక్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం చేశారు.
News December 12, 2025
మెదక్: రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్, 163 BNSS అమల్లో ఉంటాయని చెప్పారు. ర్యాలీలు, ప్రచారం, గుమిగూడడం పూర్తిగా నిషేధం. ఎన్నికలు శాంతియుతంగా జరుగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.


