News March 31, 2025
సంగారెడ్డి: నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు.!

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో నేడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కాబట్టి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News February 23, 2026
రేపు ఆదిలాబాద్లో కేటీఆర్ పర్యటన

ఈనెల 24న మంగళవారం ఆదిలాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నట్లు మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారన్నారు. పర్యటనలో భాగంగా జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నాయకులను పరామర్శించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని కోరారు.
News February 23, 2026
భక్తురాలిని పాము కాటు వేయలేదు: FactCheck

తిరుమల క్యూలైన్లో భక్తురాలు పాముకాటుకు గురైనట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని FactCheck తెలిపింది. ‘వరంగల్కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు నిన్న స్వామి దర్శనం కోసం వచ్చారు. తన కాలికి పసుపు రాసుకునే క్రమంలో మౌనిక కారు దిగడంతో కాలును ఏదో తాకింది. ఆమె భర్త వెతికి చూడగా పాము పిల్ల కనిపించింది. ఆమెను అశ్విని హాస్పిటల్కు తీసుకెళ్లగా పాముకాటుకు గురికాలేదని డాక్టర్లు నిర్ధారించారు’. అని చెప్పింది.
News February 23, 2026
తాండూరులో పట్టపగలే దారుణ హత్య

తాండూరు మండలం కరణ్కోట్లో సోమవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. స్థానిక ఆటో డ్రైవర్ సాయిలు (45)ను ఓ యువకుడు కత్తితో వెంబడించి మరీ కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. పాత కక్షలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


