News January 29, 2025
సంగారెడ్డి: నేడే ఆఖరి తేది: డీఈవో

సంగారెడ్డి జిల్లాలోని ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్లో ప్రవేశం పొందేందుకు గడువు ఇవాళతో ముగియనుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంకెవరైనా విద్యార్థులు ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు

TG: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో 1500 MW సౌర విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. కేంద్రం ఆమోదించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి GO విడుదల చేశారు. దీని ద్వారా అందే విద్యుత్ యూనిట్ ధర ₹2.90 మాత్రమే. ఇప్పటికే AP, గుజరాత్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.
News November 18, 2025
తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు

TG: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో 1500 MW సౌర విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. కేంద్రం ఆమోదించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి GO విడుదల చేశారు. దీని ద్వారా అందే విద్యుత్ యూనిట్ ధర ₹2.90 మాత్రమే. ఇప్పటికే AP, గుజరాత్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.
News November 18, 2025
ఉల్లాసంగా యూనిటీ ర్యాలీ.. పాల్గొన్న కేంద్రమంత్రి

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో సర్దార్ @ 150యూనిటీ ర్యాలీ ఉల్లాసంగా సాగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, MLC అంజిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీ గితే, వందలాది మంది యువత బతుకమ్మ ఘాట్ నుంచి కొత్తచెరువు వరకు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. దేశ ఐక్యతకు పాటుపడతామని ఈ సందర్భంగా యువత ప్రముఖులతో ప్రతిజ్ఞ చేసింది.


