News February 15, 2025
సంగారెడ్డి: నేను పుస్తకాలు చదవలేదు: జగ్గారెడ్డి

యువతకు ఉపయోగపడే ఐటీఐఆర్ ప్రాజెక్టు తీసుకురావాలని తాను బీజేపీ ఎంపీలకు అడిగితే.. తనకు ఐటీఐఆర్ ఫుల్ఫాం తెలియదంటూ ఎద్దేవా చేయడం ఎంపీ రఘునందన్రావుకు తగదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నిజంగా తాను పుస్తకాలు చదువుకోలేదని కేవలం ప్రజల మనస్తత్వం మాత్రమే చదివానని చెప్పారు. గాంధీ భవన్లో మీడీయాతో ఆయన మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కందికి ఐఐటీ తీసుకువచ్చానన్నారు.
Similar News
News December 3, 2025
మెదక్: 149 సర్పంచ్ స్థానాలకు 1007 నామినేషన్లు

మెదక్ జిల్లాలో 2వ విడతలో నామినేషన్ల స్వీకరణ రాత్రి వరకు కొనసాగింది. జిల్లాలోని 8 మండలాల్లో 149 సర్పంచ్ స్థానాలకు 1007 నామినేషన్లు వచ్చాయి. చేగుంట-188, మనోహరాబాద్-131, మెదక్-134, నార్సింగి-65, నిజాంపేట్-102, రామాయంపేట-126, చిన్నశంకరంపేట 185, తుప్రాన్-76 చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఆలాగే 1,290 వార్డు స్థానాలకు 3,430 మంది నామినేషన్లు సమర్పించారు. నేటి నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
News December 3, 2025
తూప్రాన్: ఈ ఒక్క దరఖాస్తు తీసుకోండి సారూ..!

తూప్రాన్ పట్టణంలో నామినేషన్ల చివరి రోజు ఆఖరి క్షణంలో వచ్చిన ఓ అభ్యర్థి సారూ.. నా నామినేషన్ తీసుకోమంటూ కనిపించిన వారినందరినీ అభ్యర్థించారు. మండలంలోని ఇస్లాంపూర్కు చెందిన గొల్ల కిష్టయ్య చివరి క్షణంలో నామినేషన్ వేసేందుకు నిశ్చయించి, రెండు నిమిషాల ముందు వచ్చాడు. నామినేషన్ పత్రాలు పూరించినప్పటికీ సమయం గడిచిపోయింది. నామినేషన్ పత్రాలు పట్టుకొని సార్.. ఈ ఒక్క నామినేషన్ తీసుకోండి అంటూ వేడుకున్నారు.
News December 3, 2025
మెదక్: సర్పంచ్ గిరి.. అన్నదమ్ముల సవాల్

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు సవాల్ విసురుకుంటున్నారు. గ్రామానికి చెందిన నెల్లూరు సిద్ధిరాములు, నెల్లూరి దాసు రక్తం పంచుకున్న అన్నదమ్ములు.. అది కూడా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. సర్పంచ్ పదవిపై ఇద్దరికీ ఆశ కలిగింది. దీంతో పదవి కోసం ప్రత్యర్థులుగా మారి నిన్న జరిగిన చివరి రోజు నామినేషన్లలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.


