News February 10, 2025

సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష

image

పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ వల్లూరు క్రాంతి కలెక్టరేట్లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో డీపీఓ సాయి బాబా, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Similar News

News October 14, 2025

లాభాల పంటతో ‘మిని రత్న’ హోదా

image

1941లో సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ ద్వారా స్థాపించడిన విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దేశంలోనే మొదటి నౌకానిర్మాణ కేంద్రం. 1952లో పాక్షికంగా, 1961లో పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మారింది. గత 9ఏళ్లుగా స్థిరంగా లాభాలు అర్జిస్తున్నందున నేడు ‘మిని రత్న’ హోదా లభించింది. ఇటీవల భారత నౌకాదళం కోసం ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ల నిర్మాణానికి రక్షణ మంత్రిత్వశాఖతో రూ.19వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.

News October 14, 2025

జగన్ ఆస్తుల వివాదం.. స్టేటస్ కో విధించిన NCLT

image

YS జగన్‌కు చెందిన సరస్వతి సిమెంట్స్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. జులై 29న హైదరాబాద్ NCLT బెంచ్ జగన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. జగన్ తల్లి, చెల్లెలి పేరిట రాసిన గిఫ్ట్ డీడ్‌లో షేర్లు పూర్తిగా బదిలీ కాలేదని, అందువల్ల అవి జగన్ వద్దే ఉన్నట్లు తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ విజయమ్మ చెన్నై బెంచ్‌లో అప్పీల్ చేయగా దానిపై స్టేటస్ కో విధించింది.

News October 14, 2025

నూజివీడులో ఖాతాదారుల బంగారు నగలు మాయం

image

నూజివీడులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకు సిబ్బంది ఖాతాదారులకు చెందిన రూ.8.68 లక్షల విలువైన బంగారు నగలు చోరీ చేసినట్లు మంగళవారం కేసు నమోదు చేసినట్లు సీఐ సత్య శ్రీనివాస్ తెలిపారు. 12 మంది ఖాతాదారులకు చెందిన బంగారు నగలు మాయం చేసిన ఘటనపై విజయవాడ రీజినల్ మేనేజర్ కొండలరావు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.