News February 10, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలపై రిటర్నింగ్ అధికారులకు శిక్షణ

జిల్లాలోని పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రేపు రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణఖేడ్ డివిజన్ వారికి కన్వెన్షన్ హాల్, జుకలు, జహీరాబాద్ డివిజన్ వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జహీరాబాద్, సంగారెడ్డి డివిజన్ వారికి సమీకృత కలెక్టరేట్ సంగారెడ్డి నందు శిక్షణ ఇవ్వనున్నారు.
Similar News
News November 1, 2025
ప్రెగ్నెన్సీలో నిద్రపట్టట్లేదా? ఈ టిప్స్ పాటించండి

నెలలు నిండే కొద్దీ గర్భిణుల్లో నిద్రలేమి పెరుగుతుంది. దీనికోసం కొన్ని చిట్కాలు చెబుతున్నారు వైద్యులు. ప్రెగ్నెన్సీలో డాక్టర్లు చెబితే తప్ప పూర్తి విశ్రాంతి తీసుకోకూడదు. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండాలి. ఇలాకాకుండా రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. గ్యాడ్జెట్స్కు దూరంగా ఉండాలి. నిద్రకు ముందు కాళ్లు, చేతులు, తల మసాజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
News November 1, 2025
ఖమ్మం: ‘కాపలా కాసి చంపేశారు’

సీపీఎం నేత సామినేని రామారావు <<18156229>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. రోజులాగే గ్రామంలో వాకింగ్కు వెళ్లి ఉ.6:15కు వచ్చారు. ఇంటి ఆవరణలోని కొట్టంలో కోళ్లు వదులుతుండగా మాటువేసిన దుండగులు కత్తులతో ఛాతి, పొట్టలో 8సార్లు పొడిచారు. కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఘటనా స్థలంలో హత్యకు వినియోగించిన కత్తిపౌచ్, ఓ జత చెప్పులు, టీషర్ట్ లభించాయి. విచారణకు సీపీ 5బృందాలు ఏర్పాటు చేశారు.
News November 1, 2025
NZB: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి నేపథ్యమిదే!

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమితులైన బోధన్ MLA సుదర్శన్ రెడ్డి నవీపేట్ మండలంలో 1949లో జన్మించారు. 1989లో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999లో బోధన్ నుంచి గెలిచి అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టారు. 7 పర్యాయాలు పోటీ చేసిన ఆయన 4 సార్లు MLAగా గెలిచారు. YSR హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 2023 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు.


