News February 5, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలపై మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ: డీఈవో

గ్రామపంచాయతీ ఎన్నికలకు శిక్షణ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు రేపు హైదరాబాదులో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లా నుంచి వివిధ పాఠశాలలో పనిచేస్తున్నా 10 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేశామని పేర్కొన్నారు.
Similar News
News February 12, 2025
‘కింగ్డమ్’ టీజర్పై రష్మిక స్పెషల్ పోస్ట్

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘కింగ్డమ్’ సినిమా నుంచి రిలీజైన టీజర్ ఆకట్టుకుంటోంది. దీనిపై VD ఫ్రెండ్, హీరోయిన్ రష్మిక మందన్న స్పందిస్తూ ఇన్స్టాలో స్పెషల్ పోస్ట్ చేశారు. ‘ఇతడు ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో వస్తాడు. విజయ్ నిన్ను చూసి నేను గర్విస్తున్నా’ అని రష్మిక పేర్కొన్నారు. విజయ్ కొత్త సినిమా టీజర్ మీకు నచ్చిందా? కామెంట్ చేయండి.
News February 12, 2025
అనంత: ‘బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయిన బాలుడు.. వివరాలు తెలిస్తే చెప్పండి’

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ కొండ మీదరాయుడి బ్రహ్మోత్సవాల్లో ఓ బాలుడు తప్పిపోయాడు. కనీసం తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే బుక్కరాయసముద్రం సీఐకి సమాచారం అందించాలని తెలిపారు.
News February 12, 2025
భద్రాచలం రాములవారి పెళ్లికి గజ్వేల్ నుంచి తలంబ్రాలు..

శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం కోసం వాడే గోటి తలంబ్రాల(గోటితో వలిచిన బియ్యం)ను వలిచే అవకాశాన్ని ఈసారి గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థకు భద్రాచల దేవస్థానం కల్పించింది. ఈ మేరకు 250కిలోల వడ్లను గోటితో వలచి తలంబ్రాలుగా మలచనున్నారు. ఈ మహత్కార్యంలో పాల్గొనే అవకాశం వచ్చిన శ్రీరామకోటి భక్త సమాజం సభ్యులు రామారాజును ఎమ్మెల్సీ యాదవరెడ్డి బుధవారం సన్మానించి అభినందించారు.