News March 23, 2025
సంగారెడ్డి: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ చేసిన కలెక్టర్

సదాశివపేట మండలం నాగసాన్ పల్లి పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం జారీ చేశారు. గ్రామంలో ఫైనల్ నోటిఫికేషన్ చేయకుండానే వెంచర్లకు అనుమతి ఇచ్చారని, కొందరు డీపీవోకు ఫిర్యాదు చేశారు. డీపీవో విచారణ నివేదిక ఆధారంగా పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News December 21, 2025
KMR: నకిలీ నోట్ల ముఠాపై పిడి యాక్ట్.. ఎస్పీ ఉక్కుపాదం

కామారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నకిలీ కరెన్సీ చలామణికి పాల్పడుతున్న ముఠాలోని మరో ఇద్దరు కీలక నిందితులపై PDయాక్ట్ అమలు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి టౌన్ పరిధిలోని ఒక వైన్స్ షాపులో నకిలీ రూ.500 నోట్లను మార్చే క్రమంలో ఈ ముఠా గుట్టురట్టయింది.
News December 21, 2025
మెదక్: కబడ్డీ పురుషుల, మహిళల జట్ల ఎంపిక

మెదక్ జిల్లా స్థాయి కబడ్డీ పురుషుల, మహిళల జట్ల ఎంపిక గుల్షన్ క్లబ్ ఆవరణలో నిర్వహించారు. 50 మంది పురుషులు, 40 మంది మహిళలు ఎంపిక ప్రక్రియలో పాల్గొనగా 14 మంది చొప్పున ఎంపిక చేశారు. ఈనెల 25 నుండి కరీంనగర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, ఏఎంసీ మాజీ చైర్మన్ మేడి మధుసూదన్, టీఎన్జీవో మాజీ అధ్యక్షులు శ్యామ్ రావు, ప్రభు పాల్గొన్నారు.
News December 21, 2025
కామారెడ్డి: ఫుడ్ సేఫ్టీపై రెజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా

కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఈ నెల 22న ఆహార భద్రత రిజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా నిర్వహించనున్నట్లు డెసిగ్నేటెడ్ అధికారి శిరీష తెలిపారు. ప్రతి ఆహార వ్యాపారి తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, లేనిపక్షంలో తగిన పత్రాలతో ఈ మేళాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 లక్షల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ఆమె హెచ్చరించారు.


