News February 23, 2025
సంగారెడ్డి: పది ఇంటర్నల్ మార్కులను నమోదు చేయాలి: డీఈవో

జిల్లాలోని అన్ని రకాల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను https://bse.telangana.gov.in అనే వెబ్సైట్లో స్కూల్ లాగిన్ ద్వారా ఈ నెల 28వ తేదీలోగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు.
Similar News
News October 16, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 16, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.16 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.54 గంటలకు
✒ ఇష: రాత్రి 7.06 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 16, 2025
పాలమూరు: GREAT.. తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోశాడు!

మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాపూర్ వాసి వేముల శ్రీనివాసులు(42) హైదరాబాద్లో మేస్త్రీ పని చేస్తూ ఈనెల 10వ తేదీన మూడో అంతస్తు నుంచి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య అతడి అవయవాలు దానం చేసేందుకు ఒప్పుకున్నారు. దీంతో కాలేయం, గుండె, కిడ్నీలు, కార్నియాస్ను ఆరుగురికి దానం చేశారు.
News October 16, 2025
KNR: జిల్లా కలెక్టర్తో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్

ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ పమెలా సత్పతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ వానాకాలంలో 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేస్తున్నామని తెలిపారు. 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.