News February 21, 2025
సంగారెడ్డి: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి

జిల్లాలో మార్చి 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో కార్యాలయంలో ఎంఈవోలకు ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈవో మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, విద్యుత్తు, ఫర్నిచర్, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంఈఓలు పాల్గొన్నారు.
Similar News
News October 24, 2025
BREAKING.. వంగర గురుకులంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

ఉరేసుకొని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీవీ గురుకులంలో చోటు చేసుకుంది. కాగా, పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి.. శుక్రవారం తిరిగి స్కూలుకు వచ్చినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News October 24, 2025
ఎంపీ vs ఎమ్మెల్యే.. కారణం ఇదేనా?

AP: విజయవాడ MP చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం ముదురుతోంది. కొలికపూడి గెలుపు కోసం ₹18 కోట్లు ఖర్చు చేశానని, వచ్చే ఎన్నికల్లో TDP నేత జవహర్ కొడుకు పోటీ చేస్తారని చిన్ని చెప్పడమే గొడవకు కారణమని తెలుస్తోంది. ఆత్మగౌరవానికి భంగం కలగడంతోనే <<18082832>>ఇలా మాట్లాడాల్సి<<>> వస్తోందని MLA చెప్తున్నారు. 12 నెలలుగా దేవుడని, ఇప్పుడు దెయ్యమని ఎందుకంటున్నారో చెప్పాలని చిన్ని ప్రశ్నిస్తున్నారు.
News October 24, 2025
తిరుపతి గ్రేటర్ ప్రతిపాదనకు చెక్ పెడుతున్నారా…?

తిరుపతి గ్రేటర్ ప్రతిపాదన ఇవాళ కౌన్సిల్లో కీలకం కానుంది. CM చంద్రబాబు వైజాగ్, విజయవాడ తరహాలో తిరుపతిని డెవలప్ చేయాలని సంకల్పించి, రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల 69 పంచాయతీలను విలీనంచేసే ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు. మేయర్ సుముఖంగా ఉన్నప్పటికీ, కొందరు MLAలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో ప్రక్రియ వాయిదాపడే అవకాశముంది. గ్రేటర్ లేకుండా తిరుపతి అభివృద్ధి సాధ్యం కాదని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.


