News March 12, 2025

సంగారెడ్డి: ‘పరీక్షకు 352 మంది విద్యార్థులు గైర్హాజరు’

image

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 96.81% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.16,727 మంది విద్యార్థులకు గాను 16,375 మంది విద్యార్థులు హాజరయ్యారని, 352 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

జగిత్యాలలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్

image

జగిత్యాల ఐఎంఏ హాల్‌లో గైనకాలజీ అసోసియేషన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ హేమంత్ ఈ సందర్భంగా పలువురు మహిళలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రతి మహిళ ఈ టీకా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ నివారణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య భద్రతకు ఈ టీకా ఎంతో ముఖ్యమని తెలిపారు.

News September 14, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు..

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.140 నుంచి 167, మాంసం రూ.203 నుంచి 260 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.231 నుంచి 285 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.210 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News September 14, 2025

మండవల్లి: యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడికి రిమాండ్

image

మండవల్లిలోని లోకుమూడికి చెందిన యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కైకలూరు మండలం దానగూడేనికి చెందిన భరత్ కుమార్(21)పై కేసు నమోదు చేసినట్లు SI రామచంద్రరావు శనివారం తెలిపారు. ఈ నెల 12న సాయంత్రం యువతి ఇంటికి వెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఆమె కేకలు వేయడంతో అడ్డువచ్చిన తల్లిదండ్రులపై కూడా దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసి కోర్టుకు తరలించగా..14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.