News March 19, 2025

సంగారెడ్డి: పరీక్షకు 96.63% హాజరు

image

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.63% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.18,616 మంది విద్యార్థులకు గాను 17,989 మంది విద్యార్థులు హాజరయ్యారని, 627 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

Similar News

News December 3, 2025

MCA విద్యార్థులకు గమనిక.. పరీక్షలు ఎప్పుడంటే!

image

ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ MCA 3వ సెమిస్టర్ పరీక్షల తేదీని వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 4 నుంచి (గురువారం) పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. వీటితోపాటు బ్యాక్ లాగ పరీక్షలు కూడా నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగం అధిపతి ప్రొ.శశికాంత్ తెలిపారు.పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ కోసం ఉస్మానియా వెబ్ సైట్ http://www.oucde.net/ చూడవచ్చు.

News December 3, 2025

జగిత్యాల: సర్పంచ్ రేసులో జవాన్..!

image

తన ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణే ప్రధాన ధ్యేయంగా సేవలందించి పదవీ విరమణ పొందిన ఓ ఆర్మీ జవాన్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపెల్లి గ్రామానికి చెందిన చెవులమద్ది శ్రీనివాస్ అలియాస్ మిలిటరీ శీను ఇండియన్ ఆర్మీలో 17 ఏళ్లు సేవలందించి హవల్దార్ హోదాలో పదవీ విరమణ పొందారు. దీంతో గ్రామంలోని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ బరిలో నిలిచి మంగళవారం నామినేషన్ వేశారు.

News December 3, 2025

ప్రకాశం జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలివే.!

image

ప్రకాశం జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ప్రకటించింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు సగటు వర్షపాతం 0.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. మంగళవారం రాత్రి ఒంగోలుతోపాటు పలు మండలాలలో మోస్తరు వర్షపు జాడ కనిపించింది. దిత్వా తుఫాను ప్రభావం జిల్లాపై అంతంత మాత్రమేనని చెప్పవచ్చు.