News March 19, 2025

సంగారెడ్డి: పరీక్షకు 96.63% హాజరు

image

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.63% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.18,616 మంది విద్యార్థులకు గాను 17,989 మంది విద్యార్థులు హాజరయ్యారని, 627 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

Similar News

News October 30, 2025

రంపచోడవం ఓఎస్డీ విశాఖ డీసీపీ-1గా బదిలీ

image

రంపచోడవరం ఆపరేషన్స్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ), అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ జగదీశ్ అడహళ్లి విశాఖపట్నం డీసీపీ-1 (లా అండ్ ఆర్డర్)గా బదిలీ అయ్యారు. ఈమేరకు డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జగదీశ్ అడహళ్లి యూపీఎస్సీ పరీక్షల్లో 440వ ర్యాంకు సాధించారు. అల్లూరి జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేశారు.

News October 30, 2025

మంచిర్యాల: పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి: MCPIU

image

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాల కారణంగా విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సెలవులు ప్రకటించాలని కోరారు.

News October 30, 2025

అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పంకజ్ కుమార్ మీనా

image

చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా నియమితులయ్యారు. ఈమేరకు DGP హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పంకజ్ కుమార్ మీనా చింతూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి నిర్మూలన, మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణకు విశేష కృషి చేశారు.