News January 25, 2025
సంగారెడ్డి : పాఠశాలను సందర్శించిన డీఈవో

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను డీఈఓ వెంకటేశ్వర్లు శనివారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, పాఠశాల రికార్డులు, విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News November 12, 2025
జాతీయ క్రీడలకు కుల్కచర్ల విద్యార్థి ఎంపిక

కుల్కచర్లకు చెందిన క్రీడాకారుడు పార్థసారథి రాష్ట్రస్థాయి పెన్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి, నవంబర్ 15న ఢిల్లీలో జరగబోయే నేషనల్ పెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతా యువతను క్రీడాకారులుగా మారుస్తున్నామన్నారు.
News November 12, 2025
సొంత గడ్డపై భారత్దే ఆధిపత్యం

టీమ్ఇండియాపై టెస్టుల్లో దక్షిణాఫ్రికాదే పైచేయి. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 44 టెస్టులు జరగగా సఫారీ టీమ్ 18, భారత్ 16 విజయాలు సాధించాయి. మరో 10 మ్యాచులు డ్రాగా ముగిశాయి. అయితే సొంత గడ్డపై 19 మ్యాచులు ఆడగా టీమ్ ఇండియా 11, దక్షిణాఫ్రికా ఐదింట్లో విజయం సాధించాయి. 3 టెస్టులు డ్రా అయ్యాయి. SA 2008లో చివరగా భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. ఈ నెల 14న ఇరు జట్ల మధ్య కోల్కతాలో తొలి టెస్టు ప్రారంభం కానుంది.
News November 12, 2025
రికార్డు స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు

AP: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. అన్నమయ్యలోని దేవగుడి పల్లి నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్గా వీటిని ప్రారంభిస్తారు. పీఎం ఆవాస్ యోజన కింద 2,28,034 లక్షలు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292, PMAY జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.


