News January 25, 2025

సంగారెడ్డి : పాఠశాలను సందర్శించిన డీఈవో

image

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను డీఈఓ వెంకటేశ్వర్లు శనివారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, పాఠశాల రికార్డులు, విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Similar News

News February 19, 2025

మెదక్: ఎన్నికల విధులపై కలెక్టరేట్లో సమీక్ష

image

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల 27న నిర్వహించే మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్ ఎక్కా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎన్నికల విధులు విధులు నిర్వహించే వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు.

News February 19, 2025

సెంచరీలతో చెలరేగిన NZ బ్యాటర్లు.. పాక్ టార్గెట్ ఎంతంటే?

image

ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో పాక్‌పై న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ విల్ యంగ్(107), టామ్ లాథమ్(118*) సెంచరీలతో చెలరేగారు. వీరికి తోడు ఆల్‌రౌండర్ ఫిలిప్స్(61) అర్ధ సెంచరీతో రాణించడంతో NZ 320/5 స్కోర్ చేసింది. కాన్వే 10, విలియమ్‌సన్ 1, మిచెల్ 10 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హరీస్ రౌఫ్ తలో రెండు, అబ్రార్ ఒక వికెట్ తీశారు. హరీస్ రౌఫ్ 10 ఓవర్లలో 83 పరుగులు సమర్పించుకున్నారు.

News February 19, 2025

శివరాత్రి వేడుకలు విజయవంతం చేయాలి: అదనపు కలెక్టర్

image

మహాశివరాత్రి వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో పోలీసులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి 28 వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భక్తుల సంఖ్య దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల కోసం అవసరమైన పందిర్లు ఏర్పాటు చేయాలని కోరారు.

error: Content is protected !!