News March 12, 2025

సంగారెడ్డి: పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్

image

జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి బుధవారం సందర్శించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు అందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవో విద్యాసాగర్ పాల్గొన్నారు.

Similar News

News March 18, 2025

నంద్యాల జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా విజువల్ పోలీసింగ్: ఎస్పీ

image

నంద్యాల జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా విజువల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా వేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. నేరాలు చేస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News March 18, 2025

దేవనకొండ: శ్రీ గద్దరాల మారెమ్మవ్వ చరిత్ర

image

కర్నూలు జిల్లా దేవనకొండ మండల సమీపానికి 5 కిలోమీటర్ల దూరంలో కొండల్లో వెలిసిన శ్రీ గద్దరాల మారమ్మ అవ్వ మూడేళ్లకొకసారి జరిగే ఊరు దేవురా కుంభోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. పక్కనున్న పల్లె దొడ్డి గ్రామం నుంచి 101 కుంభాలతో గద్దరాల మారెమ్మవా దేవాలయం చేరుకునే సమయంలో అమ్మవారు గద్ద రూపంలో దేవాలయం వెనకాల ఉన్న కొండపై వాలి వెళ్లిపోతుందని అక్కడి గ్రామస్థులు పురాణాలు చెబుతున్నారు.

News March 18, 2025

రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

AP: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. రేపు 58 మండలాల్లో, ఎల్లుండి 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని <>APSDMA<<>> వెల్లడించింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా చూసుకోవాలని హెచ్చరించింది. డీహైడ్రేట్ కాకుండా ORS, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచించింది.

error: Content is protected !!