News April 2, 2025
సంగారెడ్డి: ‘పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకు..’

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వల్లూరు క్రాంతి, నాయకులు పాల్గొన్నారు.
Similar News
News December 21, 2025
KCR మారతారని ఆశించా కానీ..: CM రేవంత్

TG: రెండేళ్ల తర్వాత కేసీఆర్ కలుగులో నుంచి బయటకు వచ్చారని CM రేవంత్ అన్నారు. JAN 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, కేసీఆర్ రావాలని ఆహ్వానించారు. ఓటమితో కేసీఆర్ మారతారని ఆశించా కానీ మళ్లీ అబద్ధాలే చెప్పారని వ్యాఖ్యానించారు. ఆయనకు అధికారం పట్ల ఉన్న వ్యామోహం ప్రజల పట్ల లేదని, అందుకే అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. కేసీఆర్ సీఎం అయ్యాకే జలదోపిడీ జరిగిందని మీడియాతో చిట్చాట్లో ఆరోపించారు.
News December 21, 2025
కెరమెరి: గుండెపోటుతో బట్టల వ్యాపారి మృతి

బస్సు కోసం ఎదురుచూస్తున్న వ్యక్తికి గుండెపోటు రావడంతో కూర్చున్న చోటే మృతి చెందిన ఘటన కెరమెరిలో చోటుచేసుకుంది. ASFకు చెందిన అహ్మద్ నవాబ్ బట్టల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం కెరమెరి వారసంతకు బట్టలు అమ్మడానికి వచ్చాడు. వ్యాపారం ముగించుకొని కెరమెరి బస్టాండ్లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా కూర్చున్నచోటే గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
News December 21, 2025
విశాఖ: 26 మంది వైసీపీ కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపు.. క్లారిటీ

GVMCలో కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులపై వైసీపీ చేసిన ఫిర్యాదును రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. విప్ ధిక్కరణకు సంబంధించి 26 మంది కార్పొరేటర్లకు నేరుగా నోటీసులు అందినట్లు ఆధారాలు లేవన్నారు. 26 మంది కార్పొరేటర్ల ఫిరాయింపుతో TDP మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నందని వైసీపీ ఏప్రిల్లో రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది.కాగా 80వ వార్డు కార్పొరేటర్ నీలిమ విప్ ధిక్కరణ పరిధిలోకి వస్తుందని నిర్ధారించారు.


