News November 20, 2024

సంగారెడ్డి: పీజీలో ప్రవేశాలకు నేడు ఆఖరు

image

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల పీజీ సెంటర్‌లో మిగిలిన పీజీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు ప్రిన్సిపల్ రత్నప్రసాద్ తెలిపారు.దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 20 చివరి తేదీ అని పేర్కొన్నారు. పీజీ వివిధ విభాగాల్లో మిగిలిన సీట్లలో అడ్మిషన్లు పొందేందుకు డిగ్రీ టీసీతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు ఫొటోలు, ఒక జిరాక్స్ సెట్‌తో కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News January 4, 2026

మెదక్: టెట్ పరీక్ష ప్రశాంతం: డీఈవో విజయ

image

మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హతకు టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో విజయ తెలిపారు. ఆదివారం రెండో రోజులో భాగంగా మొదటి పేపర్‌కు 100, రెండో పేపర్‌కు 100 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా మొదటి పేపర్‌కు 48 మంది హాజరు కాగా మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 71 మంది హాజరైనట్లు చెప్పారు. 81 మంది గైర్హాజరయ్యారన్నారు.

News January 4, 2026

అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం

image

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసభ్యకరమైన భాష, అబద్ధాల వరదతో ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్ న్యాయపోరాట ఫలితాలను సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇరిగేషన్ అంశాల్లో సీఎం అజ్ఞానం బయటపడిందని పేర్కొంటూ చేసిన ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీలో సమాధానం ఇస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.

News January 4, 2026

అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం

image

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసభ్యకరమైన భాష, అబద్ధాల వరదతో ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్ న్యాయపోరాట ఫలితాలను సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇరిగేషన్ అంశాల్లో సీఎం అజ్ఞానం బయటపడిందని పేర్కొంటూ చేసిన ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీలో సమాధానం ఇస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.