News February 15, 2025

సంగారెడ్డి: పోలీసు దళాలకు మొబిలైజేషన్ కార్యక్రమం

image

సంగారెడ్డిలో సాయుధ పోలీసు దళాలకు మొబిలైజేషన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ.. పర్సనల్ సెక్యూరిటీ అధికారులు వీఐపీ భద్రత విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండడానికి వీలులేదని ఆదేశించారు. రోజు వ్యాయామం చేస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోవాలన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఏఆర్డిఎస్పి నరేందర్ , సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News March 5, 2026

జగన్ పాపాలే వైసీపీకి శాపాలు: మంత్రి ఆనం

image

AP: మండలిలో కల్తీ నెయ్యిపై చెలరేగిన మంటలు చల్లారడం లేదు. YCP సభ్యుల ఆందోళనల మధ్యే తిరుమల లడ్డూపై మంత్రి ఆనం ప్రసంగించారు. ‘నివేదికలు కల్తీ జరిగాయని చెబుతుంటే YCP దుష్ప్రచారం చేస్తోంది. కల్తీ జరిగినట్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నారు కదా? జగన్ పాపాలే ఆ పార్టీకి శాపాలుగా మారాయి. గోవిందుడి తిరునామం కన్నెర్రజేసింది కాబట్టే 11 సీట్లు వచ్చాయి’ అని విమర్శించారు. సభ రేపటికి వాయిదా పడింది.

News March 5, 2026

కొత్తగూడెంలో 99 రోజులు యాక్షన్ ప్లాన్‌పై సమావేశం

image

కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై కార్పొరేటర్లతో కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. 99 రోజులపాటు కార్పొరేషన్ పరిధిలో నిర్వహించవలసిన అభివృద్ధి పనులు, డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలు, డివిజన్ పరిధిలోని సమస్యలు పరిష్కారంపై కార్యచరణ రూపొందించారు. మేయర్ గణేష్, ఉప మేయర్ లలిత, కమిషనర్ సుజాత పాల్గొన్నారు.

News March 5, 2026

గద్వాల జిల్లాను టాప్‌లో నిలపండి: కలెక్టర్

image

విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పునాది వంటిదని, ఈ ఏడాది ఫలితాల్లో గద్వాల జిల్లాను రాష్ట్రంలో టాప్-15 స్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. గురువారం గద్వాల ఐడీవోసీ నుంచి నిర్వహించిన జూమ్ అవగాహన సదస్సులో ఆయన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కీలక సూచనలు చేశారు. ఎండల దృష్ట్యా తగినంత నీరు తాగాలని, 6-8 గంటల నిద్ర తప్పనిసరన్నారు. సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు.